NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు..
    2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌

    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2045నాటికి ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన దాతృత్వ లక్ష్యాన్ని ప్రకటించారు.

    తన బ్లాగ్ పోస్ట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన గేట్స్, వచ్చే 20సంవత్సరాల్లో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ ద్వారా 200బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.

    ఈప్రకటనతో పాటు,ప్రపంచంలోని ఇతర ధనవంతులైన బిలియనీర్లు కూడా తమ దాతృత్వ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    ప్రపంచ అభివృద్ధి పట్ల గేట్స్ తన ఆశావాద దృష్టిని వెల్లడించారు.

    విదేశీ సహాయాన్ని తగ్గిస్తున్న ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా నిధుల లోటు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

    ఈనేపథ్యంలో,తన ఫౌండేషన్‌ ద్వారా రానున్న రెండు దశాబ్దాల్లో 200బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    ఇంటర్వ్యూలో ఆశావాద దృక్పథాన్ని వ్యక్తీకరించిన గేట్స్ 

    కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులు లాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, భవిష్యత్తు పట్ల తాను ఆశావహ దృక్పథంతో ఉన్నానని గేట్స్ స్పష్టం చేశారు.

    దాదాపు రెండు దశాబ్దాలలో ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన వంటి కీలక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

    'ది న్యూయార్క్ టైమ్స్'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో గేట్స్ మాట్లాడుతూ,"నన్ను కొందరు ఆప్ట్‌టిమిస్ట్ అని అంటారు,కానీ నేను వాస్తవికత ఆధారంగా ఆశావాదిగా ఉన్నాను," అని వ్యాఖ్యానించారు.

    పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు విదేశీ సహాయ నిధులను కోతకు గురిచేస్తున్న పరిస్థితుల్లోనూ, ఆయన ఆశావాదంగా ఉండటం గమనార్హం.

    వివరాలు 

    దాతృత్వ లక్ష్యాలకు గేట్స్ కట్టుబాటు 

    గురువారం విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్‌లో గేట్స్ మాట్లాడుతూ, ఈ నిధుల లోటును ఏ ఒక్క దాతృత్వ సంస్థ దింపలేనని స్పష్టం చేశారు.

    ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు తమ పేద ప్రజలకు సరైన మద్దతు ఇస్తాయా అన్న దానిపై అనిశ్చితి ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ అన్ని సవాళ్లను అంగీకరిస్తూనే, తన దాతృత్వ నిబద్ధత విషయంలో గేట్స్ స్పష్టంగా ఉన్నారు.

    బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా 2045 వరకు 200 బిలియన్ డాలర్లను ఖర్చు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.

    అంతేకాక, ఆ తర్వాత ఫౌండేషన్‌ కార్యకలాపాలు ముగియనున్నట్లు కూడా చెప్పారు.

    వివరాలు 

    ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో దృష్టి 

    ప్రసూతి,శిశు మరణాల తగ్గింపు, మలేరియా, పోలియో, మీజిల్స్ వంటి వ్యాధుల నిర్మూలన, విద్యా ప్రమాణాల పెంపు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు వంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నారు.

    ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడేలా చేసే కార్యక్రమాలపైనా ఆయన దృష్టి ఉండనుంది.

    ప్రజలు ఆరోగ్యంగా, ఆర్థికంగా స్వయం సమృద్ధిగా జీవించేందుకు ఇది సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    సాంకేతికతలో ఆశావహ నమ్మకం 

    ఈ దిశగా సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్ చెప్పారు.

    అయితే, AIని "మాయాజాలం"గా చూడకూడదని హెచ్చరిస్తూనే, దీని ద్వారా ప్రపంచ ఆరోగ్యం, అభివృద్ధిలో ప్రగతి సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మైక్రోసాఫ్ట్

    తాజా

    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్

    మైక్రోసాఫ్ట్

    Money-Stealing Malware: ఈ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ని కాపీ చేస్తుంది.. మీ డబ్బును దొంగిలిస్తుంది  సైబర్ నేరం
    Nividia: రికార్డు ర్యాలీ తర్వాత 3% పడిపోయిన ఎన్విడియా షేర్లు.. అగ్రస్థానాన్ని కోల్పోయిన మైక్రోసాఫ్ట్‌  నివిడియా
    IFixit rates: మరమ్మత్తు కోసం Microsoft తాజా సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు 8/10 టెక్నాలజీ
    Microsoft : టీమ్స్ యాప్‌ పై మైక్రోసాఫ్ట్ భారీ యాంటీట్రస్ట్ జరిమానాలు టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025