NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / G-20 Summit: బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. సంస్కృత మంత్రాలతో స్వాగతం 
    తదుపరి వార్తా కథనం
    G-20 Summit: బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. సంస్కృత మంత్రాలతో స్వాగతం 
    బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

    G-20 Summit: బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. సంస్కృత మంత్రాలతో స్వాగతం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

    ఈ పర్యటనలో ఆయన జీ-20 సదస్సు నిర్వహించే బ్రెజిల్‌తో పాటు, నైజీరియా, గ్వామ్ దేశాలను కూడా సందర్శించనున్నారు.

    తాజాగా, సోమవారం తెల్లవారు జామున ప్రధాని మోదీ బ్రెజిల్‌కు చేరుకున్నారు. ఈ రోజు రియో డి జనెరోలో జరిగే జీ-20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

    ఈ సందర్భంగా, వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

    ఈ క్రమంలో, బ్రెజిల్‌లోని భారత సంతతికి చెందిన ప్రజలు, బ్రెజిల్ అధికారులు, నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

    రియో డి జనెరోలో,బ్రెజిల్ ప్రజలు సంస్కృత మంత్రాలతో మోడీని స్వాగతించారు. అందరూ కలసి ఒకే సారి మంత్రోచ్ఛరణ చేసిన దృశ్యం ఆకట్టుకుంది.

    వివరాలు 

    19వ తేదీన గయానాకు మోదీ 

    జీ-20 సదస్సులో పాల్గొనే వారిలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఉంటారు.

    గత సంవత్సరం భారతదేశంలో జీ-20 సదస్సు నిర్వహించగా, ఈ సంవత్సరం బ్రెజిల్‌లో జరుగుతుంది. వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికాలో జీ-20 శిఖరాగ్ర సమ్మిట్ జరగనుంది.

    బ్రెజిల్ పర్యటన ముగించుకున్న తర్వాత, ప్రధాని మోడీ 19వ తేదీన గయానాకు వెళ్లనున్నారు.

    అక్కడి అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానించిన నేపథ్యంలో, 21వ తేదీ వరకు ఆయన గయానాలో అధికారిక పర్యటన కొనసాగించనుంది.

    17 ఏళ్ల తర్వాత నైజీరియాలో, 1968 తర్వాత గయానాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీనే కావడం విశేషం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రియో డి జెనీరోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ ప్రజలు సంస్కృత శ్లోకాలతో స్వాగతం పలికారు 

    #WATCH | People from Brazil welcome Prime Minister Narendra Modi to Rio de Janeiro, with Sanskrit chants. pic.twitter.com/i8VX6BiPZb

    — ANI (@ANI) November 18, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బ్రెజిల్

    తాజా

    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా
    Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్‌ రిలీజ్ కుబేర
    Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన! లాలూ ప్రసాద్ యాదవ్

    నరేంద్ర మోదీ

    Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి భారతదేశం
    West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ భారతదేశం
    PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ మహారాష్ట్ర
    Revanth Reddy: రుణమాఫీపై మీ వ్యాఖ్యలు నిజం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025