NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి 
    తదుపరి వార్తా కథనం
    నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి 
    నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి

    నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి 

    వ్రాసిన వారు Stalin
    Sep 24, 2023
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

    నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని, తమ దగ్గర నిఘా సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

    అయితే కెనడాను ఆ నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ అందించినట్లు 'ది న్యూయార్క్ టైమ్స్‌' రాసుకొచ్చింది.

    కెనడాలోని యూఎస్ రాయబారి డేవిడ్ కోహెన్ కూడా దీన్ని దృవీకరించారు. నిజ్జర్ హత్య తర్వాత నిఘా కూటమిలో భాగస్వామి అయిన కెనడాతో గూఢచార సమాచారాన్ని పంచుకున్నట్లు వెల్లడించారు.

    అయితే నిఘా సమాచారం పంచుకున్న విషయం అమెరికా ప్రభుత్వానికి తెలియదని న్యూయార్క్ టైమ్స్‌చెప్పడం కొసమెరుపు.

    అమెరికా

    ఆ ఇద్దరు అధికారులు ఎవరు?

    'ఫైవ్ ఐస్' అనే నిఘా కూటమిలో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

    ఇదిలా ఉంటే, ఇద్దరు అధికారులు నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కెనడాకు అందించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

    అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ట్రూడో ఆరోపణలు భారత్ దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

    అయితే ఆ ఇద్దరు అధికారులు ఎవరనేది వార్తాపత్రిక వెల్లడించలేదు. ఈ ఇద్దరు అధికారులు ఏ ఏజెన్సీలో పనిచేస్తున్నారో కూడా చెప్పలేదు.

    నిఘా

    కెనడా -భారతదేశం దౌత్యపోరులో అమెరికా తలదూర్చకపోవచ్చు: నిపుణుడు 

    ఇదిలా ఉంటే, కెనడా -భారతదేశం మధ్య దౌత్యపరమైన వివాదం విషయంలో అమెరికా పాత్రపై రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చార్లెస్ మైయర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కెనడా -భారతదేశం మధ్య వివాదానికి అమెరికా దూరంగా ఉండటానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

    దౌత్య పోరులో అమెరికా ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని, అందుకే భారత్, కెనడాల మధ్య సమదూరం పాటిస్తున్నట్లు చెబుతున్నారు.

    ఇటీవలి కాలంలో, అమెరికా- భారతదేశం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది.

    చైనాకు అడ్డుకట్ట వేసేందుకు అమెరాకు భారత్ మద్దతు చాలా కీలకం.

    ఈ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని చార్లెస్ మైయర్స్ అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    కెనడా
    భారతదేశం
    ఖలిస్థానీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అమెరికా

    కాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి  తుపాకీ కాల్పులు
    Sleep Walk: స్లీప్ వాక్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బాలుడు.. ఏకంగా 160.కి.మీ నడక! గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
    20 నిమిషాలు జైల్లో గడిపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 2లక్షల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల డొనాల్డ్ ట్రంప్
    అమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    కెనడా

    కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు హిందూ దేవాలయాలు
    అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ అమెరికా
    కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్ విద్యార్థులు
    కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్ ఖలిస్థానీ

    భారతదేశం

    Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్  ఆసియా కప్
    నేడు భారత్‌-నేపాల్‌ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్.. భారీ స్కోరు కోసం ఉవ్విళ్లూరుతున్న రోహిత్ సేన నేపాల్
    జిల్ బైడెన్‌ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?  అమెరికా
    భారత్, ఇండియా కాదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో పేరు మార్చే యోచనలో కేంద్రం   ఇండియా

    ఖలిస్థానీ

    గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్ పంజాబ్
    బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు పంజాబ్
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025