NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
    సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

    సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 30, 2023
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాకు సింగపూర్ తో ప్రత్యేక సంబంధాలున్నాయి.

    ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజల ఆహార భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం బియ్యం ఎగుమతికి పచ్చజెండా ఊపింది.

    ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశీయ బియ్యం ధరలను స్థిరీకరణ చేసేందుకు జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది.

    అనంతరం కొద్ది రోజులకే బాస్మతి బియ్యం ఎగుమతులపైనా కేంద్రం నియంత్రణ విధించింది.

    ఈ క్రమంలోనే సింగపూర్ దేశానికి మాత్రం బియ్యం ఎగుమతులపై ఎటువంటి నిషేధాలు లేకుండా బియ్యం ఎగుమతులపై అనుమతులు జారీ చేసింది.

    DETAILS

    జులై 20న బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధింపు

    మరోవైపు భారత్, సింగపూర్ దేశాల సన్నిహిత బంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సంబంధాల నేపథ్యంలో సింగపూర్ కు బియ్యం ఎగుమతిని అనుమతించేందుకు కేంద్రం నిర్ణయించింది.

    ఈ మేరకు విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ఇప్పటికే పలు రకాల బియ్యం ఎగుమతులపై కేంద్ర సర్కార్ పరిమితులు విధించింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు భారీగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలోనే జులై 20న కేంద్రం బియ్యం ఎగుమతికి సంబంధించిన నిబంధనలను సవరించింది.

    ఫలితంగా బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని నిషిద్ధ జోన్లోకి తీసుకొచ్చింది. సింగపూర్ కు మాత్రం ఇందుకు మినహాయింపులు ఇవ్వడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    సింగపూర్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భారతదేశం

    ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం  వ్యాపారం
    గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కైవసం టీమిండియా
    Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం స్నేహితుల దినోత్సవం
    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం ప్రధాన మంత్రి

    సింగపూర్

    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు అంతర్జాతీయం
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025