NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India vs China: సియాచిన్ సమీపంలో రహదారి నిర్మిస్తున్న చైనా.. శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి 
    తదుపరి వార్తా కథనం
    India vs China: సియాచిన్ సమీపంలో రహదారి నిర్మిస్తున్న చైనా.. శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి 
    సియాచిన్ సమీపంలో రహదారి నిర్మిస్తున్న చైనా.. శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి

    India vs China: సియాచిన్ సమీపంలో రహదారి నిర్మిస్తున్న చైనా.. శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 26, 2024
    10:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సియాచిన్ సమీపంలో అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లో చైనా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించింది.

    శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. పాకిస్తాన్ అక్రమంగా స్వాధీనం చేసుకున్న కశ్మీర్‌లో కొంత భాగాన్ని 1963 సంవత్సరంలో చైనాకు అప్పగించింది.

    ఇప్పుడు అదే ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మిస్తోంది.

    చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్ నుండి ఉద్భవించిన హైవే G219 భారతదేశం ఉత్తర సరిహద్దులోని ఇందిరా కోల్ ప్రాంతం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాచిన్ సమీపంలో వెళుతోంది.

    సియాచిన్‌

    సియాచిన్‌ను రెండుసార్లు సందర్శించిన రక్షణ మంత్రి 

    గత మార్చి నుంచి ఇప్పటి వరకు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇందిరా కోల్ ఏరియాలో రెండు సార్లు పర్యటించడం గమనార్హం.

    యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహం ఈ చిత్రాలను తీసింది.

    మీడియా కథనాల ప్రకారం, ఈ రహదారి నిర్మాణం గత సంవత్సరం జూన్, ఆగస్టులో ప్రారంభమైంది.

    కార్గిల్, సియాచిన్, తూర్పు లడఖ్‌లలో భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ భద్రతకు బాధ్యత వహిస్తుంది.

    ఈ కార్ప్స్ మాజీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ శర్మ మాట్లాడుతూ, చైనా నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తిగా చట్టవిరుద్ధమని, దీనికి వ్యతిరేకంగా భారతదేశం చైనాకు దౌత్యపరంగా నిరసన తెలియజేయాలని అన్నారు.

    భద్రత 

    భారతదేశ భద్రత దెబ్బతింటుంది

    సియాచిన్ సమీపంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు భారత్ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

    వాస్తవానికి ఈ రహదారి ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్ ప్రాంతంలో వస్తుంది. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా కశ్మీర్‌లో భాగమని భారతదేశం పేర్కొంది.

    ఈ ప్రాంతం పటంలో కూడా భారతదేశంలో భాగంగా చూపబడింది. ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ దాదాపు 5300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

    ఈ భాగంలో యథాతథ స్థితిని మార్చడం భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని భారత భద్రతా నిపుణులు అంటున్నారు.

    పాకిస్థాన్ 

    గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రావిన్స్‌లో కొత్త రహదారి

    ఈ ప్రాంతంలో చైనా మరిన్ని నిర్మాణాలు చేపడితే కొండ ప్రాంతాల్లో భారత్ భద్రతపై ప్రభావం పడుతుందన్న భయం నెలకొంది.

    2021 సంవత్సరంలో, పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రావిన్స్‌లో కొత్త రహదారిని నిర్మిస్తుందని ప్రకటించింది.

    ఇది ముజఫరాబాద్ నుండి మస్తాగ్ పాస్‌ను కలుపుతుంది. మస్తాగ్ పాస్ షక్స్‌గామ్ లోయను కలుపుతుంది.

    అటువంటి పరిస్థితిలో, చైనా, పాకిస్తాన్ ఈ ప్రాంతంతో రోడ్డు మార్గంలో కనెక్టివిటీని కలిగి ఉండవచ్చనే భయం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    చైనా

    CHINA: ఇజ్రాయెల్‌కు చైనా సంచలన మద్ధతు.. హమాస్ దాడులపై డ్రాగన్ ఏమందో తెలుసా ఇజ్రాయెల్
    చైనాపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి: కెనడాకు చైనా కౌంటర్  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    Li Keqiang: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ కన్నుమూత అంతర్జాతీయం
    అగ్రరాజ్యాన్ని కవ్విస్తున్న చైనా.. అమెరికా బాంబర్‌కు అతి సమీపంగా చైనా ఫైటర్‌ జెట్‌ అమెరికా

    భారతదేశం

    ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం  కేంద్ర ప్రభుత్వం
    MATI: 'భారత్ అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచింది'.. సొంత మంత్రులపై మాల్దీవుల టూరిజం ఫైర్  మాల్దీవులు
    Mohammed Shami: మన పర్యాటకాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి: మాల్దీవులతో వివాదంపై షమీ  మహ్మద్ షమీ
    Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం మాల్దీవులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025