NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China tarrif: 'త‌గ్గేదేలే' అంటున్న చైనా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంపు 
    తదుపరి వార్తా కథనం
    China tarrif: 'త‌గ్గేదేలే' అంటున్న చైనా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంపు 
    అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంచిన చైనా

    China tarrif: 'త‌గ్గేదేలే' అంటున్న చైనా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2025
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్రరాజ్యం అమెరికా,ఆసియా మహాశక్తి చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చైనాపై కఠిన వ్యాఖ్యలు చేస్తూ, ఆ దేశ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్నారు.

    అయితే, ట్రంప్ బెదిరింపులపై చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

    అమెరికా ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాన్ని 145 శాతం వరకూ పెంచగా, దానికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను 125 శాతం పెంచింది.

    ఈ చర్యల వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంచిన చైనా

    #Breaking China has raised additional tariffs from 84% to 125% on all imported US products.

    "Given the current tariff levels, US goods have no chance of being accepted by the Chinese market. If the US further imposes additional tariffs, China will ignore it." pic.twitter.com/Pz4GRai0BX

    — Li Zexin (@XH_Lee23) April 11, 2025

    వివరాలు 

    ట్రంప్ టారిఫ్ చర్యలపై జిన్‌పింగ్ తొలిసారి స్పందన 

    అమెరికా తీసుకుంటున్న ఆర్థిక చర్యలపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మొదటిసారి తన స్పందన తెలియజేశారు.

    డ్రాగన్ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ 'జిన్హువా'ఈ విషయాన్ని ప్రకటించింది.

    అమెరికా విధించిన 145శాతం టారిఫ్‌లను జిన్‌పింగ్ ఏకపక్ష బెదిరింపుగా అభివర్ణించారు.

    ఈ నేపథ్యంలో,అమెరికా ఆర్ధిక ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడేందుకు ఐరోపా యూనియన్‌తో చైనా చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు.

    చైనా,యూరప్ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో తమ తమ బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని,అదే సమయంలో తమ చట్టబద్ధమైన హక్కులను,జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవచ్చని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.

    అంతేకాదు,అంతర్జాతీయ వ్యవహారాలలో పారదర్శకతను,న్యాయాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    ఈ వ్యాఖ్యలు బీజింగ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో జరిగిన సమావేశం సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    చైనా

    HMVP: చైనా వైరస్‌లపై భయపడాల్సిన అవసరం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన ప్రపంచం
    HMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన సిద్ధరామయ్య
    Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఉత్తర భారతంపై ప్రభావం నేపాల్
    Three Gorges Dam Of Space: అంతులేని సౌరశక్తి కోసం.. అంతరిక్షంలో చైనా 'త్రీ గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్'! అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025