NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    USA: భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం 
    భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం

    USA: భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 18, 2025
    01:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులను తమ దేశంలోకి స్వీకరించనున్నట్లు కోస్టారికా సోమవారం ప్రకటించింది.

    ఈ విషయంపై ఆ దేశాధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ, "బుధవారం 200 మంది వలసదారులతో కూడిన విమానం మా దేశానికి చేరుకుంటుంది. వీరంతా మధ్య ఆసియా, భారతదేశానికి చెందినవారే" అని వెల్లడించింది.

    వీరిని కమర్షియల్‌ విమానం ద్వారా తరలించనున్నారు. అనంతరం పనామా సమీపంలోని వలసదారుల తాత్కాలిక శిబిరానికి వీరిని పంపే ప్రక్రియ చేపడతారు.

    ఈ మొత్తం చర్యకు అవసరమైన ఖర్చును అమెరికానే భరించనుంది.

    అంతర్జాతీయ వలస సంస్థ (International Organization for Migration) ఈ ప్రక్రియను పర్యవేక్షించనుందని కోస్టారికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

    వివరాలు 

    ఒప్పందాలు కుదుర్చుకున్న గ్వాటెమాలా, పనామా దేశాలు 

    ఇటీవల, అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో లాటిన్‌ అమెరికాలో పర్యటించారు.

    ఈ సందర్బంగా గ్వాటెమాలా, పనామా దేశాలు కూడా ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

    ఇప్పటికే, పనామా తొలివిడత కింద 119 మంది చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు చెందిన వలసదారులను స్వీకరించింది.

    అయితే గ్వాటెమాలకు మాత్రం అమెరికా నుంచి వలసదారులు ఇప్పటివరకు రాలేదు.

    వివరాలు 

    అమెరికా నుండి రెండు విమానాలు భారతదేశానికి

    అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తుండగా, 112 మంది భారతీయులను సైనిక విమానంలో ఆదివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌కు తరలించారు.

    గతంలో ఇప్పటికే రెండు విమానాలు భారతదేశానికి వచ్చాయి, ఇది మూడోది. తాజాగా వచ్చిన 112 మంది భారతీయులలో 44 మంది హరియాణాకు, 33 మంది గుజరాత్‌కు, 31 మంది పంజాబ్‌కు చెందినవారు.

    మిగిలిన వారు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలవారు. వీరి వివరాలను అధికారులు పరిశీలించిన అనంతరం వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు.

    శనివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకున్న రెండో విమానంలో మరో 116 మంది భారతీయులు వచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అమెరికా

    Deepseek: అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ ''డీప్‌సీక్‌''.. ఉద్యోగులు ఇన్‌స్టాల్ చేయొద్దని యూఎస్ కాంగ్రెస్ ఆదేశం.. డీప్‌సీక్‌
    Philadelphia: ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో కూలిన విమానం.. ఆరుగురు మృతి   అంతర్జాతీయం
    Donald Trump: పనామా కాలువపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. తీవ్ర చర్యలుంటాయని హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్
    USA: అక్రమ వలసదారులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025