NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ 
    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ

    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    May 23, 2023
    05:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిడ్నీలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

    మాస్టర్‌చెఫ్, క్రికెట్ భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని ఏకం చేశాయని అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

    తాను 2014లో ఇక్కడికి వచ్చినప్పుడు, భారత ప్రధాని కోసం ప్రవాసులు 28 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని వాగ్ధానం ఇచ్చానని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.

    అప్పుడు ఇచ్చిన మాట కోసమే తాను మరోసారి సిడ్నీకి వచ్చినట్లు ప్రధాని మోదీ అన్నారు.

    మోదీ

    భారత్-ఆస్ట్రేలియాల బంధం అతీతమైనది: మోదీ

    రెండు దేశాల మధ్య సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ, ఇంతకుముందు, భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధాలు 3సీ(కామన్వెల్త్, క్రికెట్, కర్రీల) ద్వారా బలపడ్డాయని చెప్పారు.

    ఆ తర్వాత 3డీ(డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ) ద్వారా మరింత దగ్గరైనట్లు వెల్లడించారు.

    అనంతరం 3ఈ( ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్‌)పై మన సంబంధం ఆధారపడి ఉందని మోదీ చెప్పారు.

    అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య బంధం వీటికి అతీతమైనది అని తాను నమ్ముతున్నట్లు మోదీ చెప్పారు. ఇది పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

    బ్రిస్బేన్‌లో త్వరలో భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, ఇరువురు నేతలు సెల్ఫీల కోసం జనం గుమిగూడారు.

    మోదీ

    భారతదేశంలో అతిపెద్ద యంగెస్ట్ టాలెంట్ ఫ్యాక్టరీ 

    ప్రధాని మోదీ భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రశంసించారు. ఐఎంఎఫ్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా పరిగణిస్తోందన్నారు.

    గ్లోబల్ హెడ్‌విండ్‌లను ఎవరైనా సవాలు చేస్తున్నారంటే అది భారతదేశమే అని ప్రపంచ బ్యాంక్ నమ్ముతుందని స్పష్టం చేశారు. భారతదేశంలో సామర్థ్యం, వనరుల కొరత లేదన్నారు.

    ప్రపంచంలోనే భారతదేశంలో అతిపెద్ద యంగెస్ట్ టాలెంట్ ఫ్యాక్టరీ ఉందని మోదీ పేర్కొన్నారు. క్రికెట్‌లో భారత్- ఆస్ట్రేలియా బంధం 75 ఏళ్లకు చేరుకుందని చెప్పారు.

    అయితే ఇరుదేశాల స్నేహం మైదానం వెలుపల కూడా చాలా లోతైనదన్నారు. గ్రేట్ షేన్ వార్న్ మరణించినప్పుడు వందలాది మంది భారతీయులు కూడా సంతాపం వ్యక్తం చేశారన్నారు. తమకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కోల్పోయినట్లు భావిస్తున్నామన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సిడ్నీలో ప్రధాని మోదీ ప్రసంగం

    #WATCH | "India has no dearth of capability or resources. Today, India is the biggest and youngest talent factory...," says Prime Minister Narendra Modi at the community event in Sydney, Australia. pic.twitter.com/bQePnRvI77

    — ANI (@ANI) May 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    ఆస్ట్రేలియా
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1 ప్రధాన మంత్రి
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే? రాహుల్ గాంధీ
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్
    BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు నరేంద్ర మోదీ
    గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది బెంగళూరు
    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్
    'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ మనీష్ సిసోడియా

    ఆస్ట్రేలియా

    టీ20ల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మేగాన్ షట్ అద్భుత రికార్డు క్రికెట్
    బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ పింఛ్ అద్భుత ఘనత క్రికెట్
    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ గణతంత్ర దినోత్సవం
    బాగా అలసిపోయాను, కొంచె రెస్ట్ కావాలి: డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్

    తాజా వార్తలు

    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం సీబీఐ
    'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్  అదానీ గ్రూప్
    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
     'ఎన్టీఆర్ 30' టైటిల్‌ 'దేవర'; ఫస్ట్‌ లుక్‌లో పూనకాలు తెప్పిస్తున్న ఎన్టీఆర్  జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025