Page Loader
Donald Trump:"భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్‌ ప్రయత్నం": ట్రంప్‌ సంచలన ఆరోపణలు 
"భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్‌ ప్రయత్నం": ట్రంప్‌ సంచలన ఆరోపణలు

Donald Trump:"భారత్‌లో ఎవర్నో గెలిపించేందుకు బైడెన్‌ ప్రయత్నం": ట్రంప్‌ సంచలన ఆరోపణలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా డోజ్‌ విభాగం ఇటీవల భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేటాయించిన 21మిలియన్‌ డాలర్ల నిధిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మళ్లీ సమర్థించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..గత జో బైడెన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసేందుకు వారు ప్రయత్నించారంటూ పరోక్షంగా ఆరోపించారు. మియామీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ట్రంప్‌ ఈ నిధుల అంశాన్ని ప్రస్తావించారు. ''భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు మనం ఎందుకు 21మిలియన్‌ డాలర్లను ఖర్చు చేయాలి? బహుశా ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు వారు(బైడెన్‌ ప్రభుత్వం)ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పక తెలియజేయాలి.అదే ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న  ట్రంప్‌