Muhammad Yunus:షేక్ హసీనాను దించేయడం పథకం ప్రకారం జరిగింది, సూత్రధారి పేరు వెల్లడించిన మహ్మద్ యూనస్
బంగ్లాదేశ్ను నిప్పుల కుంపటిగా మార్చడంతో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెను పీఠం నుంచి దించివేయడం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని తాత్కాలిక సారథి, నోబెల్ శాంతి ప్రదాత మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ,మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అక్కడ ఉన్నారు.
మహఫుజ్ అబ్దుల్లా పాత్ర
యూనస్ మాట్లాడుతూ, విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్కు కొత్త మార్గదర్శకత్వాన్ని అందించినట్లు అభిప్రాయపడ్డారు. హసీనాను పదవి నుంచి దించేందుకు ఎవరు కుట్ర చేశారనే విషయం ఇంకా బయటకు రాలేదు, కానీ మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చు అని పరోక్షంగా సూచించారు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదని, ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆయన చెప్పారు. అయితే, హసీనాను పీఠం నుంచి దించాలనే కుట్రలో విదేశీ ఎత్తులు ఉన్నాయని వార్తలు రాగా, అందులో అమెరికా పేరు కూడా వినిపించింది. హసీనా మేలో చేసిన ఒక ప్రకటన దీనికి కారణంగా ఉండొచ్చు.
యూనస్కు అమెరికాతో మంచి సంబంధాలు
బంగ్లాదేశ్కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో ఒక దేశానికి వైమానిక స్థావరం ఏర్పాటు చేయాలని అనుమతిస్తే, తన ఎన్నిక సాఫీగా జరిగేలా చూస్తానని ఆమె ఆఫర్ చేసినట్లు సమాచారం ఉంది. ఆ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని తీసుకువచ్చింది. అయితే, అమెరికానే ఆ దేశం అయి ఉండవచ్చని ప్రచారం సాగింది. మరోవైపు, ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగలేదని గతంలో అమెరికా విదేశాంగ శాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత తాత్కాలిక సారథి యూనస్కు మొదటి నుంచే అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయని గమనించాలి.