NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు
    టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ..ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రయత్నాలు

    TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

    ఈ హృదయవిదారక సంఘటనకు తామే కారణమని 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (TRF) అనే లష్కరే తయ్యిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ స్వయంగా ప్రకటించుకున్నట్లు భద్రతా అధికార వర్గాలు వెల్లడించాయి.

    ఈ నేపథ్యంలో TRFను అంతర్జాతీయ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చించాలని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో (ఐరాస) తక్షణ చర్యలు ప్రారంభించింది.

    ఈ లక్ష్యాన్ని సాధించేందుకు న్యూయార్క్‌లో ఉన్న భారత ప్రతినిధుల బృందం యూఎన్ ఆంక్షల పర్యవేక్షణ బృందం, ఇతర దేశాల యూఎన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది.

    అంతేకాకుండా, యూఎన్‌ ఆఫీస్‌ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్‌ అధికారులతో కూడా సమావేశమైంది.

    వివరాలు 

    TRF సంస్థకు సుప్రీం కమాండర్‌గా షేక్ సాజిద్ గుల్

    TRF అనే ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తయ్యిబా ఉగ్రసంస్థ అనుబంధంగా 2019 అక్టోబర్‌లో ఏర్పడింది.

    జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దైన అనంతరం ఈ సంస్థ ఉద్భవించింది.

    షేక్ సాజిద్ గుల్ ఈ సంస్థకు సుప్రీం కమాండర్‌గా ఉన్నాడు. బాసిత్ అహ్మద్ దార్ ప్రధాన ఆపరేషనల్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

    మొదట్లో హిజ్బుల్ ముజాహిదీన్,లష్కరే తయ్యిబా సభ్యుల సమాహారంతో ఈ సంస్థ ఏర్పడినట్లు సమాచారం.

    జమ్మూకశ్మీర్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న TRFను భారత కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించి, 2023 జనవరి 6న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    వివరాలు 

    బైసరన్ లోయలో ఉగ్రదాడి 

    యువతను ఉగ్రవాదానికి ఆకర్షించేందుకు ఈ సంస్థ ఆన్‌లైన్ ద్వారా ప్రచారం నిర్వహిస్తోందని, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటుందని పేర్కొంది.

    అంతేకాక, సామాజిక మాధ్యమాల ద్వారా జమ్మూకశ్మీర్ యువతను భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని, ప్రజలు, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతోందని హెచ్చరించింది.

    ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో భయంకరమైన మానవహానీ చోటుచేసుకుంది.

    సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు పర్యాటకులను దగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు ఐక్యరాజ్య సమితి
    IPL 2025: చీర్‌ లీడర్స్‌,డీజేలు లేకుండానే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్‌లు! ఐపీఎల్
    Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి,గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా.. ద్రౌపదీ ముర్ము ప్రశ్న ద్రౌపది ముర్ము
    Operation Sindoor: పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    ఐక్యరాజ్య సమితి

    ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..  హమాస్
    Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    Iran : ఇరాన్‌లో మరణశిక్షల పెరుగుదలను ఖండించిన ఐక్యరాజ్య సమితి..7 నెలల్లోనే 419 కేసులు ఇరాన్
    Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025