NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం
    తదుపరి వార్తా కథనం
    భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం
    భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు

    భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 23, 2023
    12:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.

    త్వరలోనే 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్నట్లు స్పష్టం చేశారు. విప్లవాత్మకమైన సంస్కరణలతో భారత్‌లో సులభతర వ్యాపార సౌలభ్యాన్ని(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను మెరుగుపర్చామన్నారు.

    2019 తర్వాత బ్రిక్స్ దేశాలు నిర్వహస్తున్న తొలి సదస్సులో పాల్గొనేందుకు మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉన్నా, భారత్ మాత్రం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

    సమీప భవిష్యత్‌లో భారత్ ప్రపంచ వృద్ధి ఇంజిన్ గా మారుతుంద‌న్నారు. భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతూ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు.

    details

    2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

    రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లోనూ ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలున్నట్లు చెప్పారు. లాజిస్టిక్స్ రంగంలో ఖర్చులు తగ్గడంతో తయారీ రంగంలో పోటీ ఏర్పడిందన్నారు.

    డిజిటల్ చెల్లింపుల్లోనూ భారత పురోగతిని మోదీ ప్రస్తావించారు. బ్రిక్స్ కోసం యూపీఐ చెల్లింపు విధానాలను ఉపయోగించేందుకు చాలా అవకాశాలున్నట్లు చెప్పారు.

    సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తూ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు వివరించారు.

    మరోవైపు జీఎస్టీ, వస్తు,సేవల పన్ను అమలుతో పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలని, భారతీయులు ప్రతిజ్ఞ పూనారని ప్రధాని స్పష్టం చేశారు.

    బ్రిక్స్ దేశాలు- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సంయుక్తంగా ప్రపంచ సంక్షేమానికి దోహదం చేస్తాయన్నారు.

    embed

    దక్షిణాఫ్రికాలో మోదీ ప్రసంగం 

    Sharing my remarks at the BRICS Business Forum in Johannesburg. https://t.co/oooxofDvrv— Narendra Modi (@narendramodi) August 22, 2023 Sharing my remarks at the BRICS Business Forum in Johannesburg. https://t.co/oooxofDvrv— Narendra Modi (@narendramodi) August 22, 2023

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిక్స్ సమ్మిట్
    సౌత్ ఆఫ్రికా
    నరేంద్ర మోదీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    బ్రిక్స్ సమ్మిట్

    బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చైనా
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  భారతదేశం
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  తాజా వార్తలు

    సౌత్ ఆఫ్రికా

    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు మధ్యప్రదేశ్
    South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి క్రికెట్
    Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ ఉమెన్ టీ20 సిరీస్
    మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం ఉమెన్ టీ20 సిరీస్

    నరేంద్ర మోదీ

    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు అశోక్ గెహ్లాట్
    కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ రాజస్థాన్
    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ రాజస్థాన్
    కీలక ప్రకటన చేసిన చైనా.. 2022 G-20 డిన్నర్‌లో మోదీ, జిన్‌పింగ్ ఏం మాట్లాడారో తెలుసా?  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025