NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే 
    తదుపరి వార్తా కథనం
    మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే 
    ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే

    మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 25, 2023
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-చైనా సంబంధాలపై డ్రాగన్ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడితే ఉమ్మడి ప్రయోజనాలకు మేలు కలుగుతుందని ప్రధాని మోదీతో అన్నారు.

    ఈనెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఈ ఇద్దరు నేతలు లోతుగా చర్చించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.

    భారత్ చైనా రిలేషన్స్ బలపడితే ప్రపంచ శాంతికే కాకుండా ఇరు దేశాల అభివృద్ధి, శాంతి, సుస్థిరతలకు ఊతమిస్తుందని జిన్‌పింగ్ చెప్పారని వెల్లడించింది.

    ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత్-చైనా సంబంధాలపై మోదీ, జిన్‌పింగ్ తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రస్తావించింది.

    DETAILS

    వెస్టర్న్ సెక్టర్‌లో గల సమస్యలపై జిన్‌పింగ్ వద్ద ప్రస్తావించిన మోదీ

    ఇండో - చైనా సరిహద్దులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను శాంతి, సామరస్యాలతో ఉమ్మడిగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

    ఈ మేరకు ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.

    గురువారం బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ ఒకే వేదికపై కూర్చున్నారు. వేదికపైకి వెళ్లే క్రమంలోనూ ఇరుదేశాధినేతలు పక్క పక్కనే వెళ్తూ చర్చించుకుంటున్నట్లు కనిపించింది.

    భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి వెస్టర్న్ సెక్టర్‌లో గల సమస్యల పరిష్కారంపై జిన్‌పింగ్ తో మోదీ ప్రస్తావించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాట్రా వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    చైనా
    నరేంద్ర మోదీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భారతదేశం

    మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ మణిపూర్
    దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ ఐఎండీ
    బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు కేంద్ర ప్రభుత్వం
    కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పునఃప్రారంభం.. భారత్- పాక్ సరిహద్దులో తగ్గిన వరదలు పాకిస్థాన్

    చైనా

    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం కోవిడ్
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  భారతదేశం
    షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా  అంతరిక్షం

    నరేంద్ర మోదీ

    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  ప్రధాన మంత్రి
    ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్  అవిశ్వాస తీర్మానం
    ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి శరద్ పవార్
    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025