NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి? 
    తదుపరి వార్తా కథనం
    BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి? 
    'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి?

    BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి? 

    వ్రాసిన వారు Stalin
    Aug 22, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిక్స్ కూటమి.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమాహారం.

    బ్రిక్స్ కూటమి ప్రారంభించి దాదాపు 22 సంవత్సరాలు అవుతోంది. ఈ కూటమిలో చేరేందుకు పలు దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కూటమిని విస్తరించాలని సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయి.

    అర్జెంటీనా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో సహా దాదాపు 40 దేశాలు బ్రిక్స్ సభ్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి.

    బ్రిక్స్ దేశాల కూటమి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 31.5%వాటాను కలిగి ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ కూటమి ఆదిపత్యం ఏంటనేది ఇది స్పష్టం చేస్తుంది.

    బ్రిక్స్

    బ్రిక్స్‌లో చేరాలనుకోవడానికి కారణాలు ఇవే.. 

    బ్రిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన కూటమి. దాని సభ్య దేశాలు గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) కంటే మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.

    ప్రస్తుతం ఉన్న ఐదు బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడీపీలో దాదాపు 31.5% వాటాను కలిగి ఉన్నాయి. జీ7 దేశాల జీడీపీ కేవలం 30.7శాతం మాత్రమే.

    3.14 బిలియన్ల జనాభాతో, బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 41% వాటాను కలిగి ఉన్నాయి. ఈ అంకెలు దేశాల శక్తి, ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి.

    2014లో బ్రిక్స్ స్థాపించిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఈ కూటమిలో ఇతర దేశాలు చేరేందుకు మరో కారణమని చెప్పాలి.

    బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి మౌలిక సదుపాయాల రంగాల్లో 34బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 100 ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేసింది.

    బ్రిక్స్

    బ్రిక్స్ కూటమి -2023 లక్ష్యాలు ఇవే.. 

    బ్రిక్స్ సమ్మిట్ సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, స్థిరమైన అభివృద్ధితో సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

    గురువారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఈ కార్యక్రమంలో గ్రూప్ విస్తరణ ప్రణాళికలపై కూడా చర్చించనున్నారు.

    అలాగే రష్యా-ఉక్రయిన్ సంక్షోభంతో పాటు డి-డాలరైజేషన్ అంశంపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు.

    బ్రిక్స్‌లో చేరడానికి అనేక దేశాలు ఆసక్తి చూపినప్పటికీ, ప్రస్తుత సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా విస్తరణపై అనిశ్చితి నెలకొంది.

    దీంతో ఈ సమావేశంలో అనిశ్చితిని తొలగించుకునే అంశం దిశగా సభ్యదేశాలు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి.

    బ్రిక్స్

    కూటమి విస్తరణపై భారత్, బ్రెజిల్ అభ్యంతరం

    చైనా, రష్యా ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి బ్రిక్స్ కూటమిని విస్తరించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

    అయితే భారత్, బ్రెజిల్ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల తమ ప్రభావం తగ్గుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

    అంతేకాకుండా ఈ కూటమి చైనా ఆధిపత్యం చెలరేగుతుందని భారత్ భయపడుతోంది.

    కాగా, కొత్త సభ్యులను పారదర్శకంగా, ఇప్పటికే ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఆధారంగా చేర్చుకోవాలని బ్రెజిల్ వాదిస్తోంది.

    భారత్, బ్రెజిల్ భయాందోళన మధ్య కూటమి విస్తరణకు మార్గం సుగమం అవుతుందా? లేదో వేచి చూడాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిక్స్ సమ్మిట్
    భారతదేశం
    చైనా
    బ్రెజిల్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బ్రిక్స్ సమ్మిట్

    బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చైనా
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  భారతదేశం
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  తాజా వార్తలు

    భారతదేశం

    26 రఫేల్‌ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.. రక్షణశాఖ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం యుద్ధ విమానాలు
    ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష దిల్లీ
    ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలు  ఫ్రాన్స్
    సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్ పాకిస్థాన్

    చైనా

    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు ఉత్తరాఖండ్
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం కోవిడ్

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025