NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు 
    తదుపరి వార్తా కథనం
    ISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు 
    గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు

    ISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 07, 2023
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు శక్తిసామర్థ్యాలతో కృషి చేయాలని కోరారు.

    ఐడీఎఫ్ తక్షణ కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాల ఉమ్మడి ప్రయత్నానికి రాజధాని టెహ్రాన్ మద్దతుగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు.

    గాజాలో ఇజ్రాయెల్ చర్యలను ముగించేందుకు భారతదేశం తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలని ఆయన కోరారు.

    ఇరు దేశనేతల మధ్య ఈ మేరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పాశ్చాత్య వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశం గత పోరాటాలను,నాన్-అలైన్డ్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరిగా భారత్ ను ఆయన గుర్తు చేసుకున్నారు.

    గాజా ప్రజలపై హింసను ఆపేందుకు భారత్ కలిసివస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    DETAILS

    పాలస్తీనా ప్రజలకు ేమద్ధతునివ్వాలి : ఇరాన్

    ఇజ్రాయెల్ దేశం చేస్తున్న యుద్ధాన్ని తక్షణం ఆపడం, గాజాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, అణగారిన ప్రజలకు సహాయాన్ని అందించడం కోసం చేసే ప్రపంచ ఉమ్మడి ప్రయత్నానికి టెహ్రాన్ మద్దతుగా నిలుస్తుందని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.

    పాలస్తీనా ప్రజలను చంపడం ప్రపంచంలోని అన్ని స్వేచ్ఛా దేశాలకు కోపం తెప్పించిందని ఇబ్రహీం రైసీ అన్నారు.

    అమాయక మహిళలు, పిల్లలను చంపడం, ఆస్పత్రులు, పాఠశాలలు, మసీదులు, చర్చిలతో పాటు నివాస ప్రాంతాలపై దాడులు ఏ మానవుడి దృక్కోణం నుంచైనా ఖండించదగినవేనన్నారు.

    హింస ఆమోదయోగ్యం కానివని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలస్తీనాను ఆక్రమించుకుంటున్న జియోనిస్ట్ పాలనను ఎదుర్కోనేందుకు బాధిత దేశానికి చట్టబద్ధమైన హక్కు ఉందన్నారు.

    అణచివేత నుంచి విముక్తి కోసం పాలస్తీనా పోరాటానికి అన్ని దేశాలు మద్దతివ్వాలని రైసీ కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇరాన్
    నరేంద్ర మోదీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఇరాన్

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి ప్రపంచం
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం విద్యార్థులు
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి ఇండియా

    నరేంద్ర మోదీ

    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే  వాట్సాప్
    పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ పార్లమెంట్
    గణతంత్ర దినోత్సవ వేడుకలకు జో బైడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025