
Trump: ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు.. తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబు దాడులు జరిపిందని, ఇందుకు సంబంధించి వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇరాన్లో అత్యంత రహస్యమైన,శక్తివంతమైన భూగర్భ అణు కేంద్రం అయిన ఫోర్డోపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో భారీగా దాడి చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ వేల టన్నుల రాత్రి మాత్రమే మిగిలి ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని, ప్రస్తుతం ఆ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేయగల స్థితిలో లేదని స్పష్టం చేశారు. కనీసం ప్రస్తుతానికి అయినా అణ్వాయుధాల అభివృద్ధి దిశగా ఇరాన్ అడుగు వేయలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు.
వివరాలు
ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లపై అమెరికా దాడులు
ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం,"ఆపరేషన్ మిడ్నైట్ హామర్" అనే గోప్యమైన ఆపరేషన్లో భాగంగా, జూన్ 22న ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలు.. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లపై అమెరికా దాడులు చేసింది. వీటిలో ముఖ్యంగా భూగర్భంలో ఉన్న ఫోర్డోపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతానికి ఇరాన్కు అణ్వాయుధాలు లేవని,అయితే భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల అభివృద్ధికి ప్రయత్నిస్తే మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఫోర్డో అణు కేంద్రం పర్వతాల లోతుల్లో నిర్మించబడి ఉండడం వల్ల దీనిపై దాడికి చాలా శక్తివంతమైన ఆయుధాలు అవసరమయ్యాయి.
వివరాలు
జూన్ 13న ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబు దాడులు
ఈ కారణంగా అమెరికా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబులు అయిన GBU-57A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్ (MOPs)తో అమర్చిన కనీసం ఏడు B-2 స్టెల్త్ బాంబర్లను వినియోగించింది. ఈ బాంబర్లు ధ్వంసాత్మక శక్తితో ఫోర్డో కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు సమాచారం. ఇక జూన్ 13న ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబు దాడులు నిర్వహించింది.టార్గెట్ గా అణు కేంద్రాలనే ఎంచుకుంది. ఈ దాడుల్లో పలువురు ఇరానీ కమాండర్లు,అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
యుద్ధ ఉద్రిక్తతల నడుమ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అనంతరం అమెరికా రంగప్రవేశం చేసి మరింత శక్తివంతమైన దాడులు చేపట్టింది. ఈ యుద్ధ ఉద్రిక్తతల నడుమ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్,ఇజ్రాయెల్ ప్రభుత్వాలు కూడా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తాత్కాలికంగా అయినా శాంతియుత వాతావరణం నెలకొన్నదని సమాచారం.