
Iran: వారిద్దరూ దేవుని శత్రువులు.. ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్లోని అగ్ర మతాధికారి ఫత్వా జారీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను "దేవునికి శత్రువులు"గా పేర్కొంటూ, ప్రముఖ ఇరానీ షియా మతపరమైన గురువు అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఈ ఇద్దరిపై వ్యతిరేకంగా ఏకమవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, ముస్లిం నాయకులెవరూ వీరికి మద్దతివ్వకూడదని కూడా ఫత్వాలో స్పష్టం చేశారు. ట్రంప్, నెతన్యాహు చెప్పే మాటలు, వారు చేసిన పనులన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నవిగా పేర్కొంటూ, వారి పశ్చాత్తాపం చెందేలా చర్యలు తీసుకోవాలని షిరాజీ ముస్లింలను కోరారు. ఏ నాయకుడినైనా బెదిరించే వ్యక్తి లేదా ప్రభుత్వం మొహరేబ్ (అంటే దేవునితో యుద్ధానికి దిగినవారు)గా పరిగణించబడుతారని ఆయన ఇచ్చిన ఫత్వాలో పేర్కొనబడింది.
వివరాలు
జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి
ఒకవేళ ఎవరైనా మొహరేబ్గా గుర్తించబడితే, వారికి ఉరిశిక్ష విధించడం, శిలువ వేయడం, శరీర భాగాలను తెంచడం లేదా సమాజం నుంచి వెలివేయడం వంటి కఠిన శిక్షలు విధించవచ్చని ఫ్యాక్స్ న్యూస్ నివేదికలో పేర్కొంది. ఇంకా ఫత్వాలో ముస్లింలు,ఇస్లామిక్ దేశాలు దేవునికి శత్రువులైన వ్యక్తులకు ఎటువంటి సహాయం లేదా మద్దతు ఇవ్వకూడదని, వారు చేసిన తప్పులకు వారు పశ్చాత్తాపపడేలా చేయడం తప్పనిసరని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగింది. ముఖ్యంగా అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించాయి.
వివరాలు
ట్రంప్ కీలక ప్రకటన
ఈ దాడుల్లో పలువురు ఇరానీ అణు శాస్త్రవేత్తలు,కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆపై అమెరికా కూడా ఈ సంఘటనల్లో జోక్యం చేసుకుని, శక్తివంతమైన బాంబర్లతో ఇరాన్పై దాడి చేసింది. యుద్ధ ఉద్రిక్తతలు అత్యంత తీవ్రమవుతున్న సమయంలో, ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఆయన ప్రకటించారు. వెంటనే ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు కూడా అధికారికంగా దీన్ని ధృవీకరించాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలికంగా శాంతి వాతావరణం నెలకొనింది.