
Iran: 'అణు ఒప్పందంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదు'.. అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" అనే కోడ్ పేరుతో, ఇరాన్లోని కీలక అణు సదుపాయాలపై అకస్మాత్తుగా వైమానిక దాడులు జరిపింది.
ఈ దాడులు ఇరాన్కు తీవ్రంగా ప్రతికూలంగా మారాయి. వెంటనే స్పందించిన ఇరాన్, అధునాతన రాకెట్లను ప్రయోగిస్తూ ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడికి దిగింది.
ఈ ఘర్షణలతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండించిన ఇరాన్, "ఇది ఒక యుద్ధ ప్రకటనతో సమానమైన చర్య. దీన్ని తాము ఎలా ఎదుర్కొంటారో ప్రపంచం త్వరలోనే గమనిస్తుంది" అంటూ గట్టిగ హెచ్చరించింది.
అంతేకాకుండా, అణుశక్తిపై అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలిపింది.
వివరాలు
ఇరాన్ చర్చల వైపు రాకపోతే రెండు వారాల్లో తుది నిర్ణయం: ట్రంప్
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ, "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఈ దాడుల్లో అమెరికా నేరుగా భాగస్వామిగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది" అని ఆరోపించారు.
అలాగే, "అణు ఒప్పందం అంశంపై అమెరికాతో చర్చలు జరిపే అవకాశమే లేదు" అని ఖచ్చితంగా పేర్కొన్నారు.
ఇకపోతే, ఇరాన్ చర్చల వైపు రాకపోతే రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ ఇజ్రాయెల్కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అబ్బాస్ తీవ్ర స్థాయిలో స్పందించారు.