
Israel Iran War: ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ప్రారంభించిన ఇరాన్ .. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్నదశాబ్దాల పాత శత్రుత్వం మళ్లీ భగ్గుమంది.
ఇజ్రాయెల్ ఇటీవల చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్" కు ప్రతిస్పందనగా ఇరాన్ "ఆపరేషన్ ట్రూ ప్రామిస్" అనే బలమైన ప్రతిదాడిని ప్రారంభించింది.
శుక్రవారం ఇజ్రాయెల్ తన వైమానిక దళాలను వినియోగించి టెహ్రాన్ పరిసరాల్లో ఉన్న అనేక అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేసింది.
ఈ దాడుల్లో ఇరాన్కు భారీ నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ ప్రతినిధి ప్రకారం, ఈ దాడుల్లో మొత్తం 78 మంది ప్రాణాలు కోల్పోయారు,వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులేనని తెలిపారు.
అలాగే 320 మందికిపైగా గాయపడ్డారు.
వివరాలు
ఇరాన్ ప్రతిదాడి - క్షిపణుల వర్షం
అయితే, ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనలో, ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్లు, తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతిచెందారని వెల్లడించింది.
ఇజ్రాయెల్ దాడికి తక్షణమే స్పందించిన ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా, టెల్ అవీవ్, జెరూసలేం నగరాలపై డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిపింది.
పలు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 34 మంది వరకు గాయపడ్డారు.
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకారం, వారు ఇజ్రాయెల్లోని అనేక ముఖ్యమైన లక్ష్యాలపై దాడులు నిర్వహించారని తెలిపారు.
దీంతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరన్లు మోగాయి. ప్రజలెందరో బంకర్లకు పరుగెత్తడం కనిపించింది.
వివరాలు
స్పందించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకారం, ఈ దాడులు తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్నవేనని ఆరోపించింది.
తాము ఎదుర్కొంటున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తిప్పికొట్టేందుకు ఇంటర్సెప్టార్ మిస్సైల్స్ను ప్రయోగించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వెల్లడించింది.
అంతేకాదు, అమెరికా సహకారంతో ఈ అడ్డుదెబ్బను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు కూడా ప్రకటించింది.
వివరాలు
24 గంటల్లోపే మళ్లీ దాడులు..
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వైమానిక దాడికి 24 గంటల్లోపే ఇజ్రాయెల్ మళ్లీ దాడికి దిగింది.
ఈసారి టెహ్రాన్తో పాటు దేశంలోని పలు ప్రాంతాలపై భారీ బాంబుల వర్షం కురిపించింది.
మొత్తం 200 లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అణు కేంద్రములు, సైనిక స్థావరాలు ప్రధానంగా లక్ష్యాలు.
ఇస్ఫహాన్లోని అణు కేంద్రంపై దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
ఫైటర్ జెట్లను ఉపయోగించి ఈ దాడులు జరిగాయని తెలిపింది. అంతేకాదు, ఫోర్డూ అణుకేంద్రం సమీపంలో కూడా భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.