NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel-Hamas: గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 130 మందికి పైగా మృతి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Israel-Hamas: గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 130 మందికి పైగా మృతి 
    గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 130 మందికి పైగా మృతి

    Israel-Hamas: గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. 130 మందికి పైగా మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    08:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేపట్టింది.

    ఈ దాడుల్లో 130 మందికి పైగా మరణించినట్లు సమాచారం. సంధి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్, ఐఎస్‌ఏ దాడులు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

    అనంతరం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించినందునే ఈ దాడులకు ఆదేశించినట్లు తెలిపారు.

    వివరాలు 

     హమాస్ కీలక ప్రకటన 

    'మా బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ నిరాకరిస్తూనే ఉంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు చేపట్టింది. యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం' అని నెతన్యాహు ఎక్స్‌లో పేర్కొన్నారు.

    ఇకపై హమాస్‌కు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    హమాస్‌ హెచ్చరికలు

    ఈ దాడులు కొనసాగుతున్న తరుణంలో హమాస్ కీలక ప్రకటన చేసింది.

    తాజా దాడుల కారణంగా ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, దీంతో బందీల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని హమాస్ ఆరోపించింది.

    ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది.

    వివరాలు 

    ల్పుల విరమణ చర్చలు  ప్రారంభించాలన్న హమాస్

    దీని ప్రకారం, హమాస్ దాదాపు 30 మంది బందీలను విడుదల చేయగా, ప్రతిగా ఇజ్రాయెల్ 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

    ఈ క్రమంలో రెండో దశ కాల్పుల విరమణపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, అవి అవ్వలేదు.

    రంజాన్ సందర్భంగా, తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు పొడిగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించారు.

    దీనికి ఇజ్రాయెల్ అంగీకరించినప్పటికీ, హమాస్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, హమాస్‌పై ఒత్తిడి పెంచేందుకు నెతన్యాహు చర్యలు చేపట్టారు.

    అందులో భాగంగా, గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని నిలిపివేసి, విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు.

    మరోవైపు , హమాస్ మాత్రం కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    తాజా

    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్
    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు  ఇజ్రాయెల్
    Israel-Hamas War : గాజాలో వేల సంఖ్యలో మరణాలు.. 'డంబ్ బాంబ్సే' కారణమా? ఇజ్రాయెల్
    Joe Biden : గాజా పౌరుల ప్రాణాలను రక్షించాలి.. కానీ హమాస్'పై యుద్ధం ఆగిపోకూడదు జో బైడెన్
    Israel - Hamas war: ఉత్తర గాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025