
Israel: ఖాన్ యూనిస్లోని యూరోపియన్ హాస్పిటల్ కింద హమాస్ గాజా చీఫ్ మృతదేహం లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ చీఫ్గా ఉన్న మొహమ్మద్ సిన్వర్ మృతదేహాన్నిగాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రి కింద ఉన్న సొరంగం నుంచి తమబలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఇజ్రాయెల్ తాజాగా వెల్లడించింది.
నెల రోజుల కిందటే సిన్వర్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించగా,ఇప్పుడు ఆయన మృతదేహాన్ని ఆస్పత్రి కింద ఉన్న సొరంగం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఐడీఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ వెల్లడించిన ప్రకారం,ఈఆపరేషన్ ఖాన్ యూనిస్లోని యూరోపియన్ హాస్పిటల్ కింద జరిగినదిగా చెప్పారు.
అదేసమయంలో హమాస్కు చెందిన మరో కీలక నాయకుడు,రఫా బ్రిగేడ్ కమాండర్గా ఉన్న మొహమ్మద్ షబానా కూడా అక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
వీరితోపాటు ఇంకా పలువురు హమాస్ ఉగ్రవాదులు కూడా హతమయ్యారని స్పష్టంచేశారు.
వివరాలు
మొహమ్మద్ సిన్వర్,షబానా మరణాన్నిధృవీకరించని హమాస్
ఈసొరంగం సైనిక చర్యల సమయంలో గుర్తించబడిందని చెప్పారు.
హమాస్ ఈ ప్రాంతాన్ని తమ ఉగ్ర చర్యలకు కేంద్రంగా వాడుకుంటుందని,ఆసుపత్రులను,పౌర మౌలిక సదుపాయాలను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నదాని డెఫ్రిన్ పేర్కొన్నారు.
ఆసుపత్రి కింద అత్యవసర గదుల సముదాయం ఉన్నందున,అక్కడే మొహమ్మద్ సిన్వర్ మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదిలా ఉండగా,మొహమ్మద్ సిన్వర్,షబానా మరణాన్ని హమాస్ ఇంకా ధృవీకరించలేదు.
ఇజ్రాయెల్ బలగాలు ఇద్దరి మృతదేహాలను తమ ఆధీనంలోకి తీసుకున్నా,హమాస్ నుంచి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా,గత సంవత్సరం అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్పై తీవ్ర దాడులకు పాల్పడిన వ్యక్తిగా మొహమ్మద్ సిన్వర్ను గుర్తించిన సంగతి తెలిసిందే.
కాగా అతడి సోదరుడు యాహ్యా సిన్వర్ను గతేడాది ఐడీఎఫ్ జరిపిన ఆపరేషన్లో హతమార్చినవిషయం తెలిసిందే.