Page Loader
Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం
ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం

Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2024
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ లెబనాన్‌లోని ఖనా నగరంపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ ఘటనలో మేయర్ అహ్మద్ కహిల్ సహా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని పౌర నివాసాల మధ్య ఉన్న స్థావరాలను తీవ్రంగా టార్గెట్ చేసింది. లెబనాన్ సివిల్ డిఫెన్స్ తెలిపిన వివరాల ప్రకారం, కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం, దక్షిణ లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల (యూనిఫిల్) పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 15 మంది ఐరాస సైనికులు గాయపడ్డారు.

Details

250మందికి పైగా హెజ్బొల్లా ఫైటర్లు మృతి

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఐరాస దళాలను ప్రమాదకర ప్రాంతాల నుంచి వెంటనే వైదొలగాలని కోరారు. ఇప్పటివరకు, దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భూతల దాడుల్లో 250 మందికి పైగా హెజ్‌బొల్లా ఫైటర్లు మరణించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అందులో 21 మంది కమాండర్లు ఉన్నారని పేర్కొంది. హెజ్‌బొల్లా తమ సైనిక సామర్థ్యాలను భారీగా కోల్పోయినా, ఇజ్రాయెల్‌పై దాడి చేసే సామర్థ్యాలు ఇంకా ఉన్నాయని ఐడీఎఫ్ తెలిపింది. ఇటీవల, హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌లోని బిన్యామినా ప్రాంతంలోని సైనిక స్థావరంపై భీకర డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందగా, 60 మందికి పైగా గాయాల పాలయ్యారు.