NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానుల‌పై పాలస్తీనా అనుకూల గుంపు దాడి
    తదుపరి వార్తా కథనం
    Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానుల‌పై పాలస్తీనా అనుకూల గుంపు దాడి
    ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానుల‌పై పాలస్తీనా అనుకూల గుంపు దాడి

    Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానుల‌పై పాలస్తీనా అనుకూల గుంపు దాడి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా పౌరులు ఆమ్‌స్టర్‌డామ్‌లో దాడి చేసారు. నెదర్‌ల్యాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ వేదికగా జరిగిన ఐరోపా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడ్డాయి.

    మ్యాచ్ ముందు ఇజ్రాయెల్ అభిమానులు, పాలస్తీనా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

    మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఘర్షణ కొనసాగింది. ఈ ఘటనలో 10 మంది ఇజ్రాయెల్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు, ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    ఇజ్రాయెల్ పౌరులకు బహిరంగ ప్రదేశాల్లోకి రావద్దని సూచించింది. ఆ సంస్థ డచ్ ప్రభుత్వానికి తమ పౌరులను సురక్షితంగా విమానాశ్రయానికి తీసుకురావడంలో సహాయం చేయాలని కోరింది.

    వివరాలు 

    62 మంది నిరసనకారులను అదుపులోకి..

    సమాచారం ప్రకారం, వందలాది ఇజ్రాయెల్ జట్టు మద్దతుదారులు ఆమ్‌స్టర్‌డామ్‌కు వచ్చి, ప్రధాన కూడళ్ళలో ఇజ్రాయెల్ జెండాలు ఊపుతూ, పాలస్తీనా జెండాలను తొలగించారు.

    ఈ చర్యలకు ప్రతిస్పందనగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి 600 మంది పోలీసులు రంగంలోకి దిగారు.

    62 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ దాడిని ఖండించారు.

    దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బాధితుల కోసం రెస్క్యూ విమానాలను వెంటనే పంపాలని ఆదేశించారు.

    వివరాలు 

    40వేల మందికి పైగా పౌరులు మృతి

    గతేడాది, ఇజ్రాయెల్‌లోని ఒక మ్యూజిక్ ఫెస్టివల్‌లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల కారణంగా ప్రారంభమైన ఈ దాడుల శ్రేణి ఇప్పటికీ కొనసాగుతోంది.

    హమాస్ ప్రారంభించిన దాడిలో 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 250 మందికి పైగా సాధారణ ప్రజలను బందీలుగా తీసుకెళ్లారు.

    ఈ యుద్ధం తీవ్రంగా విస్తరించిన తరవాత, హిజబుల్లా, ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్‌పై మరిన్ని దాడులు జరుగుతున్నాయి.

    కాల్పుల విరమణకు ప్రయత్నాలు అయినప్పటికీ, దాడుల తీవ్రత తగ్గలేదు.

    గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 40వేల మందికి పైగా పౌరులు మృతిచెందినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    పాలస్తీనా

    తాజా

    Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా ! ఐపీఎల్
    Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ తెలంగాణ
    Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం  వైజాగ్
    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ  చంద్రబాబు నాయుడు

    ఇజ్రాయెల్

    Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు  హిజ్బుల్లా
    israel: ఇజ్రాయెల్‌ కొత్త 'లైట్‌ బీమ్‌' డిఫెన్స్‌ సిస్టమ్‌.. అమెరికాలో ప్రదర్శన  అమెరికా
    Hamas:ఇజ్రాయెల్‌పై భారీగా ఆత్మాహుతి దాడులకు సిన్వార్‌ కుట్ర..వెల్లడించిన వాల్‌స్ట్రీట్‌ కథనం  హమాస్
    Israel-Hezbollah: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి..22 మంది మృతి  లెబనాన్

    పాలస్తీనా

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి  ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025