NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు 
    భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు

    Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 14, 2025
    08:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక మోసానికి సంబంధించి నిందితుడైన మెహుల్ చోక్సీ అరెస్టైనట్టు సమాచారం.

    భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా బెల్జియం దేశంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ను మోసం చేసి వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని దేశం నుంచి పరారైన చోక్సీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు శనివారం అరెస్టయ్యారని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.

    ప్రస్తుతం అతను బెల్జియంలోని ఓ జైల్లో ఉన్నాడు.

    వివరాలు 

    పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ₹13,500 కోట్ల భారీ రుణ మోసం 

    చోక్సీ అరెస్టు సమయంలో ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్ ఎండ్ అరెస్ట్ వారెంట్లను అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

    అయితే, ఆరోగ్య సమస్యలు,ఇతర వ్యక్తిగత కారణాలను ఆధారంగా చూపుతూ అతను బెయిల్ కోసం అర్జి చేసే అవకాశం ఉందని సమాచారం.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ₹13,500 కోట్ల భారీ రుణ మోసానికి సంబంధించిన కేసులో చోక్సీ ప్రధాన నిందితుడిగా నిలిచిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం అతను తన భార్య ప్రీతీ చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్ నగరంలో నివసిస్తున్నాడు.

    వివరాలు 

     2018 జనవరిలో దేశం విడిచిపెట్టిన చోక్సీ 

    చోక్సీకి ఆంటిగ్వా అండ్ బార్బడోస్ దేశ పౌరసత్వం ఉంది. వైద్యం కోసం ఆ దేశాన్ని విడిచినట్లు సమాచారం.

    ఇదే కేసులో సహ నిందితుడైన అతడి మేనల్లుడు నీరవ్ మోడీని లండన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది.

    దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పీఎన్‌బీలో జరిగిన ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాక ముందు, 2018 జనవరిలోనే మెహుల్ చోక్సీ దేశం విడిచిపెట్టాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెల్జియం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బెల్జియం

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన హత్య
    Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. నిర్ధారించిన యూరోపియన్ దేశం అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025