NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Bangladesh: మాకెప్పుడు ఇచ్చారు: $29 మిలియన్ USAID మంజూరుపై బంగ్లాదేశ్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bangladesh: మాకెప్పుడు ఇచ్చారు: $29 మిలియన్ USAID మంజూరుపై బంగ్లాదేశ్‌
    మాకెప్పుడు ఇచ్చారు: $29 మిలియన్ USAID మంజూరుపై బంగ్లాదేశ్‌

    Bangladesh: మాకెప్పుడు ఇచ్చారు: $29 మిలియన్ USAID మంజూరుపై బంగ్లాదేశ్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    01:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఓటింగ్‌ను పెంచేందుకు జో బైడెన్ పరిపాలనలో అమెరికా అందించిన సహాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే విమర్శలు చేస్తున్నారు.

    యూఎస్‌ఎయిడ్‌ (USAID) ద్వారా అందిన 21 మిలియన్‌ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.182 కోట్లు) నిధులపై రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది.

    బంగ్లాదేశ్‌ (Bangladesh) కు కూడా యూఎస్‌ఎయిడ్‌ ద్వారా రూ.251 కోట్లు (29 మిలియన్‌ డాలర్లు) సహాయంగా అందించామని, ఆ నిధుల ద్వారా వారు కమ్యూనిస్టులకు ఓటేశారని ట్రంప్ ఆరోపించడం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది.

    వివరాలు 

     75 ఎన్జీవోలకు విదేశీ నిధులు 

    ''ఆ నిధులు మా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు. ఏయే ఎన్జీవోలు దీనిలో పాత్ర వహించాయో వారు చెబితే, మేము వాటిని గుర్తించగలం. మా పరిధిని దాటి వారు నిధులను ఎలా పంపించారో మాకు తెలియదు'' అని బంగ్లాదేశ్‌ ఎన్జీవో వ్యవహారాల బ్యూరో చీఫ్‌ తెలిపారు.

    అంతేకాకుండా, 75 ఎన్జీవోలకు విదేశీ నిధులు అందుతున్నట్లు వెల్లడించారు.

    విదేశీ దాతలు నమోదిత ఎన్జీవోలకు విరాళాలు ఇస్తే, ఆ వివరాలు తమ రికార్డుల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

    యూఎస్‌ఎయిడ్‌ ద్వారా ప్రభుత్వానికి అందిన నిధులు ఏజెన్సీలకు బదిలీ అయితే, ఆ లెక్కలు తమ వద్ద ఉండవని తెలియజేశారు.

    వివరాలు 

     నిధుల గురించి స్పష్టత ఇచ్చిన భారతదేశం

    భారతదేశం కూడా ఈ నిధుల గురించి స్పష్టత ఇచ్చింది. యూఎస్‌ఎయిడ్‌ ద్వారా భారత్‌లోని 7 ప్రాజెక్టులకు 2023-24లో రూ.6,498 కోట్లు (750 మిలియన్‌ డాలర్లు) నిధులు వచ్చాయని, అయితే అవి ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు కాదని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

    భారత ప్రభుత్వంతో కలిసి యూఎస్‌ఎయిడ్‌ కొన్ని ప్రాజెక్టులపై పని చేస్తోందని తెలిపింది.

    అమెరికా సహాయంపై రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ ఈ వివరణ ఇచ్చింది.

    ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు ఎటువంటి నిధులు అందలేదని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    బంగ్లాదేశ్

    Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన కోల్‌కతా
    Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. మరో 2 ఇస్కాన్ పూజారులు "మిస్సింగ్ " ఇస్కాన్
    Is Indians safe in Bangladesh: భారతీయ పర్యాటకుడిపై దాడి.. బంగ్లాదేశ్‌లో భారతీయులు సురక్షితంగా ఉన్నారా? భారతదేశం
    Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. ఖండించిన ఇస్కాన్  ఇస్కాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025