NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Joe Biden: నస్రల్లా మృతి న్యాయమైనదే.. జో బైడెన్‌
    తదుపరి వార్తా కథనం
    Joe Biden: నస్రల్లా మృతి న్యాయమైనదే.. జో బైడెన్‌
    నస్రల్లా మృతి న్యాయమైనదే.. జో బైడెన్‌

    Joe Biden: నస్రల్లా మృతి న్యాయమైనదే.. జో బైడెన్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 29, 2024
    09:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్‌ బీరుట్‌పై నిర్వహించిన దాడుల్లో హెజ్‌బొల్లా నేత షేక్‌ హసన్‌ నస్రల్లా మృతి చెందారు.

    ఈ నేపథ్యంలో నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ న్యాయసమ్మతమైన చర్యగా పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.

    గతేడాది ప్రారంభమైన యుద్ధంలోనే నస్రల్లాను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌ ప్రారంభమైందని చెప్పారు.

    ఇరానియన్‌ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులైన హెజ్‌బొల్లా, హమాస్‌లపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని బైడెన్‌ మరోసారి స్పష్టం చేశారు.

    నస్రల్లా నేతృత్వంలోని హెజ్‌బొల్లా కారణంగా వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయినట్లు బైడెన్‌ గుర్తు చేశారు.

    Details

    అమెరికన్‌ పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలి

    అదేవిధంగా మధ్య ప్రాచ్యంలోని యూఎస్‌ సైనిక దళాల భద్రతను మరింత పటిష్ఠం చేయాలని రక్షణ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

    బీరుట్‌లో తలెత్తిన భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్న దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్‌ పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని విదేశాంగ శాఖ పేర్కొంది.

    ఇజ్రాయెల్‌ బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు నిర్వహించగా, ఈ దాడుల్లో నస్రల్లా సహా, ఆయన కుమార్తె కూడా మరణించారని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

    పాలస్తీనా కోసం తమ పోరాటం కొనసాగిస్తామని, తమ శత్రువులకు ఎదురు నిలుస్తామని హెజ్బొల్లా స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జో బైడెన్
    అమెరికా

    తాజా

    Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి  ఇజ్రాయెల్
    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌ నీతి ఆయోగ్
    Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌! డొనాల్డ్ ట్రంప్

    జో బైడెన్

    గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్  ఇజ్రాయెల్
    హమాస్‌, రష్యా ఇద్దరి ఎజెండా ఒకటే : బైడెన్‌ కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయం
    ఇద్దరు అమెరికన్ బంధీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు  అమెరికా
    Joe Biden : గాజాపై దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు.. సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు ఇజ్రాయెల్

    అమెరికా

    America: 'పెద్ద దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది'... ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసిన అమెరికా అంతర్జాతీయం
    Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు భూకంపం
    Indian Air Force : 'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు భారతదేశం
    Green Card: గ్రీన్ కార్డ్ పొందడానికి 100 సంవత్సరాలు పడుతుందా? విద్యార్థులు, ఉద్యోగార్ధులను'అమెరికాకు రావద్దని' హెచ్చరించిన భారతీయ ఇంజనీర్  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025