Page Loader
India: చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ
చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ

India: చర్చలేమీ జరగలేదు.. మోదీ-ట్రూడో సమావేశంపై కేంద్రం వివరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

లావోస్‌లో జరిగిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చలపై వివాదం మొదలైంది. ట్రూడో, మోదీతో తన భేటీని ఉద్ఘాటిస్తూ, పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అయితే భారత అధికారులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మోదీ, ట్రూడో మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ట్రూడో 'ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య' విషయంలో భారత్ పై విమర్శలు చేశాడు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే.

Details

భారత వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలి

ట్రూడో తన ప్రభుత్వం కెనడియన్ల భద్రత, చట్టానికి సంబంధించి బాధ్యతగా భావిస్తుందని పేర్కొన్నప్పటికీ, భారత్‌ అధికారులు ఈ ప్రకటనలను తిరస్కరించారు. భారత విదేశాంగ శాఖ వర్గాల ప్రకారం తాము కెనడాతో ఉన్న సంబంధాలను గౌరవిస్తున్నామని తెలిపారు. కానీ కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు సాధారణ స్థితికి రావడం కష్టమని స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించడం ఆందోళనకరంగా మారింది.