Page Loader
Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్ 
25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్

Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2024
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కుదిరిన లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నవాజ్‌ షరీఫ్‌ మంగళవారం అంగీకరించారు. భారత్‌తో తాను, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతకం చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆయన అంగీకరించారు. పాకిస్థాన్ అణుపరీక్షలు జరిపి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఎంఎల్-ఎన్ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మే 28, 1998న పాకిస్థాన్ ఐదు అణుపరీక్షలు నిర్వహించిందన్నారు. ఆ తర్వాత వాజపేయి ఇక్కడికి వచ్చి మాతో ఒప్పందం చేసుకున్నారు. కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాము.. అది మా తప్పు"అని పార్టీ సమావేశంలో ఆయన అన్నారు.

Details 

ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే కార్గిల్ యుద్ధం 

1999లో తాను, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతకం చేసిన భారత్‌తో ఒప్పందాన్ని ఇస్లామాబాద్ ఉల్లంఘించిందని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ దుర్ఘటనను స్పష్టంగా ప్రస్తావించారని షరీఫ్ అన్నారు. ఫిబ్రవరి 21, 1999న చారిత్రక శిఖరాగ్ర సమావేశం తర్వాత షరీఫ్, వాజ్‌పేయి లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, సుస్థిరత దృక్పథం గురించి మాట్లాడిన ఈ ఒప్పందం ఒక పెద్ద విజయాన్ని సూచిస్తుంది. అయితే కొన్ని నెలల తర్వాత జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ చొరబాటు కార్గిల్ యుద్ధానికి దారితీసింది.

Details 

అణు పరీక్షలను నిలిపివేయడానికి అమెరికా ఆఫర్ 

"పాకిస్తాన్ అణు పరీక్షలను ఆపడానికి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ US $ 5 బిలియన్లను ఆఫర్ చేసాడు, కానీ నేను నిరాకరించాను. ఇమ్రాన్ ఖాన్(మాజీ ప్రధాని) వంటి వ్యక్తి నా సీటులో ఉంటే, అతను ఈ ప్రతిపాదనను అంగీకరించి ఉండేవాడు" అని నవాజ్ షరీఫ్ అన్నారు.

Details 

షెహబాజ్ షరీఫ్‌ను ప్రశంసించిన నవాజ్ 

నవాజ్ షరీఫ్ తన తమ్ముడు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కూడా ప్రశంసించారు. ప్రతి బ్యాడ్ టైంలో షరీఫ్ తనకు అండగా నిలిచారని అన్నారు. మా మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి కానీ షహబాజ్ నాకు విధేయుడిగానే ఉన్నాడు. షాబాజ్‌ని కూడా ప్రధాని అయ్యి నన్ను వదిలేయమని గతంలో అడిగారు, కానీ అతను నిరాకరించాడు. పీఎంఎల్‌ఎన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ బలోపేతానికి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభిస్తానని నవాజ్ షరీఫ్ చెప్పారు.