NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్ 
    తదుపరి వార్తా కథనం
    Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్ 
    25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్

    Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2024
    09:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌పై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కుదిరిన లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నవాజ్‌ షరీఫ్‌ మంగళవారం అంగీకరించారు.

    భారత్‌తో తాను, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతకం చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆయన అంగీకరించారు.

    పాకిస్థాన్ అణుపరీక్షలు జరిపి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఎంఎల్-ఎన్ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మే 28, 1998న పాకిస్థాన్ ఐదు అణుపరీక్షలు నిర్వహించిందన్నారు.

    ఆ తర్వాత వాజపేయి ఇక్కడికి వచ్చి మాతో ఒప్పందం చేసుకున్నారు. కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాము.. అది మా తప్పు"అని పార్టీ సమావేశంలో ఆయన అన్నారు.

    Details 

    ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే కార్గిల్ యుద్ధం 

    1999లో తాను, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతకం చేసిన భారత్‌తో ఒప్పందాన్ని ఇస్లామాబాద్ ఉల్లంఘించిందని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ దుర్ఘటనను స్పష్టంగా ప్రస్తావించారని షరీఫ్ అన్నారు.

    ఫిబ్రవరి 21, 1999న చారిత్రక శిఖరాగ్ర సమావేశం తర్వాత షరీఫ్, వాజ్‌పేయి లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు.

    రెండు దేశాల మధ్య శాంతి, సుస్థిరత దృక్పథం గురించి మాట్లాడిన ఈ ఒప్పందం ఒక పెద్ద విజయాన్ని సూచిస్తుంది.

    అయితే కొన్ని నెలల తర్వాత జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ చొరబాటు కార్గిల్ యుద్ధానికి దారితీసింది.

    Details 

    అణు పరీక్షలను నిలిపివేయడానికి అమెరికా ఆఫర్ 

    "పాకిస్తాన్ అణు పరీక్షలను ఆపడానికి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ US $ 5 బిలియన్లను ఆఫర్ చేసాడు, కానీ నేను నిరాకరించాను.

    ఇమ్రాన్ ఖాన్(మాజీ ప్రధాని) వంటి వ్యక్తి నా సీటులో ఉంటే, అతను ఈ ప్రతిపాదనను అంగీకరించి ఉండేవాడు" అని నవాజ్ షరీఫ్ అన్నారు.

    Details 

    షెహబాజ్ షరీఫ్‌ను ప్రశంసించిన నవాజ్ 

    నవాజ్ షరీఫ్ తన తమ్ముడు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కూడా ప్రశంసించారు.

    ప్రతి బ్యాడ్ టైంలో షరీఫ్ తనకు అండగా నిలిచారని అన్నారు. మా మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి కానీ షహబాజ్ నాకు విధేయుడిగానే ఉన్నాడు.

    షాబాజ్‌ని కూడా ప్రధాని అయ్యి నన్ను వదిలేయమని గతంలో అడిగారు, కానీ అతను నిరాకరించాడు.

    పీఎంఎల్‌ఎన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ బలోపేతానికి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభిస్తానని నవాజ్ షరీఫ్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్

    పాకిస్థాన్

    Pakistan attacks Iran: బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు..  ఇరాన్
    Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. మరీ సానియాకు విడుకులు ఇచ్చాడా?  తాజా వార్తలు
    Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది' సానియా మీర్జా
    IND vs ENG: రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌ ఎంపికపై ఇమామ్ కీలక కామెంట్స్  క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025