NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO
    ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO

    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    02:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) తాజా నివేదికలో వెల్లడించింది.

    ఈ సంక్షోభం కారణంగా 11 మిలియన్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

    2024 నవంబర్ నుండి 2025 మార్చి వరకూ పాకిస్థాన్‌లో ఆహార కొరత తీవ్రంగా కొనసాగినట్లు వెల్లడించింది.

    వివరాలు 

    ఎఫ్ఏఓ తాజా నివేదిక ప్రకారం: 

    ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభ పరిస్థితులపై FAO శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, బలూచిస్థాన్,సింధ్,ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రజలు ఆహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.

    దాదాపు 11మిలియన్ల మంది లేదా పాకిస్థాన్ మొత్తం జనాభాలో సుమారు 22శాతం మంది తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని అంచనా వేసింది.

    వీరిలో 1.7మిలియన్ల మంది అత్యవసర సహాయానికి అర్హులుగా ఉన్నట్లు పేర్కొంది.

    2024లో నమోదైన గరిష్ఠ స్థాయి ఆహార కొరతతో పోల్చితే, 2025లో ఇది మరో 38శాతం మేర పెరిగే అవకాశం ఉందని సూచించింది.

    గత సంవత్సరం కంటే కొంత మేరకు ఆహార లోపం తగ్గినప్పటికీ,వాతావరణ పరిస్థితులు ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని నివేదిక స్పష్టం చేసింది.

    వివరాలు 

    తీవ్రమైన పోషకాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది 

    2023 నవంబర్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో దాదాపు 11.8 మిలియన్ల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నట్టు నివేదిక తెలిపింది.

    2023లో జరిగిన పరిస్థితులే 2024లోనూ కొనసాగాయని పేర్కొంది. ముఖ్యంగా బలూచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లో 2018 నుండి 2024 ప్రారంభం వరకూ ప్రజలు తీవ్ర స్థాయిలో పోషకాహార లోపాన్ని అనుభవించారని వివరించింది.

    2025లో వాతావరణ మార్పులు, కొనసాగుతున్న ఆహార సంక్షోభం కారణంగా ఈ పోషకాహార లోపం మరింత అధికమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

    వివరాలు 

    భారీగా ప్రభావితమవుతున్న జిల్లాలు 

    శీతాకాలంలో బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ రాష్ట్రాల్లోని 43 గ్రామీణ జిల్లాల్లో దాదాపు 11.8 మిలియన్ల మంది తీవ్రమైన ఆహార లోపంతో బాధపడుతున్నారు.

    వీరిలో 2.2 మిలియన్ల మంది 2023 నవంబర్ నుండి 2024 జనవరి మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు.

    2023 మార్చి నుండి 2024 జనవరి మధ్య 6 నెలల నుండి 59 నెలల వయస్సు కలిగిన సుమారు 2.1 మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక వివరించింది.

    వివరాలు 

    స్త్రీలు, శిశువులపై తీవ్ర ప్రభావం 

    గర్భిణీలు, పాలిచ్చే బాలింతలలో పోషకాహార లోపం తీవ్రంగా కనిపిస్తున్నదని నివేదిక పేర్కొంది.

    సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లో చాలా మంది శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని స్పష్టం చేసింది.

    శీతాకాలంలో ఈ ప్రాంతాల్లో విరేచనాలు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మలేరియాతో ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని తెలియజేసింది.

    ఈ పరిస్థితులకు ప్రధాన కారణాలుగా పారిశుద్ధ్య సౌకర్యాల లేమి, శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేకపోవడమని FAO నివేదిక లో తెలిపింది.

    ఈ అంశాలు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రమైన స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు

    పాకిస్థాన్

    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్
    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయం
    Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం

    ఐక్యరాజ్య సమితి

    Iran : ఇరాన్‌లో మరణశిక్షల పెరుగుదలను ఖండించిన ఐక్యరాజ్య సమితి..7 నెలల్లోనే 419 కేసులు ఇరాన్
    Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం ఇజ్రాయెల్
    UNO : భద్రతా మండలిలో అత్యవసర తీర్మానం ఆమోదం.. గాజాలో మానవతావాద కాల్పుల విరమణ ఇజ్రాయెల్
    US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట  ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025