NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం?
    భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం?

    India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 04, 2025
    10:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాదానికి తలదాల్చే దేశంగా పాకిస్థాన్‌పై భారతదేశం మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్‌ నుంచి వస్తున్న దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ప్రతీకారంగా పాకిస్థాన్‌ భారత్‌పై ఆంక్షలు విధించేందుకు రెడీ అయింది. భారత జెండా ఉన్న నౌకలు తమ నౌకాశ్రయాలను వినియోగించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

    అంతేకాదు భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉత్పత్తులపై కూడా నిషేధం విధించింది. అదే విధంగా పాక్‌ జెండాతో ఉన్న నౌకలు భారత్‌లోని పోర్టులకు రాకూడదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Details

    పాకిస్థాన్‌ నుంచి రవాణా అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపై నిషేధం

    ఈమేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాకిస్థాన్‌ నుంచి రవాణా అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపై నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది.

    1958 మర్చెంట్ షిప్పింగ్ చట్టంలోని 411 సెక్షన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భారత నౌకలు కూడా పాకిస్థాన్‌ పోర్టులకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.

    ఇప్పటికే పాక్‌ విమానాల కోసం మన గగనతలాన్ని మూసివేసిన భారత్‌, ఇప్పుడు తపాలా శాఖ ద్వారా రాకపోకలు కూడా నిలిపివేసింది.

    పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఉత్తరాలు, పార్సిళ్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేసింది.

    Details

     పరిశ్రమలకు గట్టి ఎదురుదెబ్బ

    గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌ దిగుమతులపై 200 శాతం దిగుమతి సుంకం విధించింది. అప్పటినుంచి ఆ దిగుమతులు తగ్గిపోయాయి.

    తాజాగా పహల్గాం ఉగ్రదాడి, సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపు చర్యలు పెరగడంతో కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఈ చర్యలు తీసుకుంది.

    ఇతర దేశాల గుండా పాక్‌ వస్తువులు భారత్‌కు చేరకుండా ఈ ఆంక్షలు ప్రభావవంతంగా అమలవుతాయి. ఫలితంగా పాక్‌ ఎగుమతులపై ఆధారపడే పరిశ్రమలకు భారీ దెబ్బ తగలనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    భారతదేశం

    తాజా

    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్

    పాకిస్థాన్

    Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్.. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే భారీ నష్టాలు బిజినెస్
    Pahalgam Attack: సింధు జలాల ఒప్పందం రద్దు.. స్పందించిన పాక్‌  అంతర్జాతీయం
    India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్‌ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్‌  భారతదేశం
    Pak Deputy PM: 'పహల్గాం దాడికి పాల్పడినఉగ్రవాదులను 'స్వాతంత్ర్య సమరయోధులు'.. పాక్‌ ఉపప్రధాని అనుచిత వ్యాఖ్యలు.. అంతర్జాతీయం

    భారతదేశం

    Tavasya:భారత నౌకాదళంలోకి 'తవస్య' ప్రవేశం.. సముద్రంలో భారత శక్తిని చూపనున్న యుద్ధనౌక గోవా
    India:పదేళ్లలో భారత జీడీపీ డబుల్.. జపాన్, జర్మనీని అధిగమించే దిశగా ముందుకు! బిజినెస్
    S Jaishankar: భారత ప్రయోజనాలే ప్రాధాన్యం.. వాణిజ్య ఒప్పందాలపై జైశంకర్ స్పష్టత భారతదేశం
    India-US: ఎగుమతులను కాపాడుకునేందుకు..US దిగుమతులపై సుంకం తగ్గింపు  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025