
IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) భారీ ఒత్తిడి పెడుతోంది.
తాజా నివేదిక ప్రకారం, ఐఎంఎఫ్ పాకిస్తాన్పై మరో 11 ఆర్థిక షరతులను విధించింది. దీంతో పాకిస్తాన్పై ఇప్పటివరకు IMF విధించిన మొత్తం షరతుల సంఖ్య 50కి చేరింది.
IMF నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను రూ.2.414 ట్రిలియన్లుగా ప్రణాళిక వేస్తోంది, ఇది గత ఏడాదితో పోల్చితే రూ.252 బిలియన్లు లేదా 12% పెరుగుదలగా ఉంది.
భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినప్పటికీ, పాకిస్తాన్ మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై దాడి ప్రయత్నాలు చేసింది.
Details
కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి
నాలుగు రోజుల పాటు క్రాస్-బోర్డర్ డ్రోన్, మిసైల్ దాడులు కొనసాగడంతో మే 10న భారత్, పాకిస్తాన్ మధ్య అవగాహన ఏర్పడింది.
IMF కొత్త షరతుల ప్రకారం జూన్ 2025 నాటికి IMF లక్ష్యాల అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది.
అదే సమయంలో నాలుగు రాష్ట్రాలు జూన్ నెలలో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి.
దీనికి సంబంధించి పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచారం, అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది.
IMF సూచనల ప్రకారం గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేత చర్యల ప్రణాళికను కూడా ప్రభుత్వము ప్రచురించాలి.
Details
ఏడాది చివరిలోగా నివేదిక సమర్పించాలి
2027 తర్వాత ఆర్థిక రంగ పరిపాలన, నియంత్రణకు సంబంధించిన ప్రణాళికను రూపొందించడం కూడా అవసరం. ఎనర్జీ రంగంలో కూడా IMF కొత్త షరతులు విధించింది.
ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, మే నెలాఖరులోపు ఆర్డినెన్స్ను శాశ్వత చట్టంగా మార్చాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాల్సి ఉంది.
ఇక 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాలని IMF కోరింది. దీనికి సంబంధించిన నివేదికను ఈ ఏడాది చివర్లో సమర్పించాలని చెప్పింది.
ఇవి కాకుండా జూలై చివర నాటికి వాణిజ్య ప్రయోజనాల కోసం 5 సంవత్సరాల లోపు వయస్సున్న వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని సూచన ఉంది.