NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
    ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ఐసిస్ స్కెచ్!.. భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 24, 2025
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందింది.

    ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవనున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

    తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), ఐఎస్ఐఎస్ (ISIS), బలూచిస్తాన్‌కు చెందిన ఇతర ఉగ్రవాద గ్రూపులు ఈ కుట్రకు పాల్పడుతున్నట్లు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వెల్లడించినట్లు సమాచారం.

    ఈ కుట్రలో ప్రధానంగా విదేశీ అతిథులే లక్ష్యంగా ఉన్నారని తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు ఈ కుట్రకు తెరతీశాయని హెచ్చరించింది.

    వివరాలు 

    2009లో జరిగిన ఉగ్రదాడి

    ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది.

    అయితే భద్రతా కారణాల వల్ల భారత్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. ఈ కారణంగా భారత మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చారు.

    ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలు ఇంజమామ్-ఉల్-హక్, రమీజ్ రాజా, మిస్బా-ఉల్-హక్ మాట్లాడుతూ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాముఖ్యతను వివరించారు.

    2009లో జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ క్రికెట్‌ను ఎలా ప్రభావితం చేసిందో గుర్తు చేశారు.

    ఈ దాడుల కారణంగా పాకిస్థాన్ క్రికెట్‌కు 10 సంవత్సరాల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.

    వివరాలు 

    టోర్నమెంట్‌లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లే పాల్గొంటాయి 

    "ఈ టోర్నమెంట్‌ను 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. 2009 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ టోర్నమెంట్‌ను నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించేలా మార్చారు. ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లే ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి" అని ఐసీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

    2008లో పాకిస్థాన్‌లో జరగాల్సిన షెడ్యూల్‌ను రద్దు చేసి దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    పాకిస్థాన్

    Shaheen Shah Afridi: పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు క్రీడలు
    Jason Gillespie: పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్ప్పుకున్న జాసన్ గిలెస్పీ క్రీడలు
    Babar Azam: టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ అజామ్ బాబార్ అజామ్
    Pakistan:పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్న నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025