NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం
    ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం

    Pakistan: ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో,దాని ప్రభావం ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్థాన్‌పై కనిపించబోతోందని ఇండస్‌ రివర్‌ సిస్టమ్‌ అథారిటీ (ISRA)అంచనా వేసింది.

    దేశానికి వచ్చే నీటిలో సుమారు 21 శాతం మేర కోత ఏర్పడే అవకాశం ఉందని ISRA పేర్కొంది.

    ముఖ్యంగా చీనాబ్‌ నదిలో నీటి లభ్యత తగ్గుతుండటం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా నిలుస్తుందని తెలిపింది.

    ఇప్పటికే సలాల్‌,బగ్‌లిహార్‌ డ్యామ్‌ల గేట్లు మూసివేయడంతో, పాకిస్తాన్‌ వైపు వెళ్లే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది.

    మరాల ప్రాంతంలో ఇప్పటికే నీటి కొరత స్పష్టంగా కనిపిస్తోంది.ఈపరిణామం ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌పై ప్రభావం చూపించనుందని అధికారులు భావిస్తున్నారు.

    కిషన్‌ గంగా నదిపై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని భారత్‌ యోచిస్తోంది.

    వివరాలు 

    ఖరీఫ్‌ ప్రారంభంలో పాకిస్తాన్‌ 21 శాతం తక్కువ నీటిని అందుకుంటుందని అంచనా

    మే నుంచి సెప్టెంబర్‌ వరకు జరిగే ఖరీఫ్‌ సీజన్‌లో నీటి అందుబాటును అంచనా వేసేందుకు ISRA సమావేశమైంది.

    ''మే మొదటి వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో, తర్వాతి కాలంలో నీటి లభ్యతపై సమీక్షలు కొనసాగుతాయి. భారత్‌ నిర్ణయంతో మరాల వద్ద చీనాబ్‌ నదిలో నీటి లభ్యత తగ్గిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.ఇది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో మరింత నీటి కొరతకు దారి తీసే అవకాశం ఉంది'' అని ISRA స్పష్టం చేసింది.

    చీనాబ్‌,రావి నదులలో సాధారణ స్థాయిలో ప్రవాహం కొనసాగితేనైనా ఖరీఫ్‌ ప్రారంభంలో పాకిస్తాన్‌ 21 శాతం తక్కువ నీటిని అందుకుంటుందని అంచనా వేసింది.

    అలాగే రోజువారీగా సమీక్షలు నిర్వహించి,చీనాబ్‌లో నీటి ప్రవాహం మరింత తగ్గితే,తాము చేసిన అంచనాలను సవరిస్తామని ISRA పేర్కొంది.

    వివరాలు 

    నది మధ్యలోకి వెళ్ళి ఫోటోలు దిగుతున్న పర్యాటకులు

    చీనాబ్‌ నదిలో అక్నూర్‌ ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది.

    ఈ స్థితిని చూస్తే పర్యాటకులు నది మధ్యలోకి వెళ్ళి సులభంగా ఫోటోలు దిగుతున్న పరిస్థితి ఏర్పడింది.

    ఈ నీటి తగ్గుదలకు ప్రధాన కారణం సలాల్‌, బగ్‌లిహార్‌ డ్యామ్‌ల మూసివేతే అని స్పష్టమవుతోంది.

    ఏప్రిల్‌ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్‌ పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు ప్రారంభించింది.

    ఇందులో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే కాకుండా, పాక్‌తో వాణిజ్యం, రాకపోకలను నిలిపివేసింది.

    అంతేకాకుండా, దేశ గగనతలాన్ని కూడా మూసివేసింది. ఈ చర్యలతో పాటు త్రివిధ దళాలను ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలుగుతున్నట్లుగా సిద్ధం చేస్తూ ఏర్పాట్లు చేపట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    పాకిస్థాన్

    Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక భారతదేశం
    #NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ భారతదేశం
    Pak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ  ఆర్మీ
    Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025