Page Loader
Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఏమన్నారంటే!
ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని.. ఏమన్నారంటే!

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఏమన్నారంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
11:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్'పై తొలిసారి పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. తమ దేశంపై జరిగిన దాడులకు తగిన ప్రతిచర్య తప్పదని, ఆ దిశగా అవసరమైన చర్యలు తప్పక తీసుకుంటామని ఆయన అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన షరీఫ్‌, ''తగిన సమాధానం ఎలా ఇవ్వాలో పాకిస్థాన్‌ బలగాలకు బాగా తెలుసు. దేశ సాయుధ దళాల వెనుక దేశం మొత్తం నిలుస్తోంది'' అని స్పష్టం చేశారు. భారత్‌ తమ దేశాన్ని వెనక్కి తగ్గే దేశంగా భావిస్తోందన్న అహంకారంలో ఉందని విమర్శిస్తూ, ''పాకిస్థాన్‌ ధైర్యవంతుల దేశం అనే విషయాన్ని వారు మరిచిపోయారు'' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

వివరాలు 

భారత్‌ సైనిక చర్యలో 26 మంది మృతి..  46 మందికి గాయాలు 

ఇదిలా ఉండగా, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్‌ అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల సిబ్బందిని అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. గగనతలాన్ని 48 గంటలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించిన పాక్‌ ప్రభుత్వం,బుధవారం సాయంత్రానికి ప్రధాన విమాన రూట్లలో సేవలను మళ్లీ ప్రారంభించినట్లు వెల్లడించింది. అదే విధంగా, ఇస్లామాబాద్‌, పంజాబ్‌ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సమర్థవంతంగా మోహరించింది. భారత్‌ చేపట్టిన ఈ సైనిక చర్యలో 26 మంది మరణించారని, మరో 46 మందికి గాయాలయ్యాయని పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ISPR) డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు.