NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఏమన్నారంటే!
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఏమన్నారంటే!
    ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని.. ఏమన్నారంటే!

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఏమన్నారంటే!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    11:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్'పై తొలిసారి పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు.

    తమ దేశంపై జరిగిన దాడులకు తగిన ప్రతిచర్య తప్పదని, ఆ దిశగా అవసరమైన చర్యలు తప్పక తీసుకుంటామని ఆయన అన్నారు.

    దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన షరీఫ్‌, ''తగిన సమాధానం ఎలా ఇవ్వాలో పాకిస్థాన్‌ బలగాలకు బాగా తెలుసు. దేశ సాయుధ దళాల వెనుక దేశం మొత్తం నిలుస్తోంది'' అని స్పష్టం చేశారు.

    భారత్‌ తమ దేశాన్ని వెనక్కి తగ్గే దేశంగా భావిస్తోందన్న అహంకారంలో ఉందని విమర్శిస్తూ, ''పాకిస్థాన్‌ ధైర్యవంతుల దేశం అనే విషయాన్ని వారు మరిచిపోయారు'' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    భారత్‌ సైనిక చర్యలో 26 మంది మృతి..  46 మందికి గాయాలు 

    ఇదిలా ఉండగా, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్‌ అప్రమత్తమైంది

    దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల సిబ్బందిని అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

    గగనతలాన్ని 48 గంటలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించిన పాక్‌ ప్రభుత్వం,బుధవారం సాయంత్రానికి ప్రధాన విమాన రూట్లలో సేవలను మళ్లీ ప్రారంభించినట్లు వెల్లడించింది.

    అదే విధంగా, ఇస్లామాబాద్‌, పంజాబ్‌ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సమర్థవంతంగా మోహరించింది.

    భారత్‌ చేపట్టిన ఈ సైనిక చర్యలో 26 మంది మరణించారని, మరో 46 మందికి గాయాలయ్యాయని పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ISPR) డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    పాకిస్థాన్

    DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ! హైదరాబాద్
    India-Pakistan: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు భారతదేశం
    Shahid Afridi: పహల్గామ్ ఉగ్రదాడిపై అఫ్రిది కీలక వ్యాఖ్యలు.. మండిపడుతున్న భారతీయులు షాహీద్ ఆఫ్రిది
    Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025