NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్
    తదుపరి వార్తా కథనం
    కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్
    కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్

    కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్

    వ్రాసిన వారు Stalin
    Jul 05, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు.

    8,126 మీటర్ల నంగా పర్బత్ పర్వతం శిఖరాగ్రానికి వెళ్లడానికి ప్రయత్నించిన ఆయన భారీ మంచు కురవడంతో అక్కడే చిక్కుకుపోయాడని ఆల్పైన్ క్లబ్ ఆఫ్ పాకిస్థాన్ (ఏసీపీ) వెల్లడించింది.

    ఆసిఫ్ 7,500 మీటర్ల నుంచి 8,000మీటర్ల ఎత్తులో క్యాంప్ 4లో చిక్కుకుపోయాడని, అతనికి సహాయం అవసరమని ఏసీపీ కార్యదర్శి కర్రార్ హైద్రీ తెలిపారు.

    నంగా పర్బత్‌ వెళుతున్న వారు అందించిన సమాచారం ప్రకారం, తీవ్రమైన మంచు కారణంగా అతను ముందుకు కదల్లేకపోతున్నారు.

    మంచు పర్వతం

    ఆసిఫ్ భట్టి కోసం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని ప్రధాని షెహబాజ్ ఆదేశం

    అసిఫ్‌ను రక్షించడానికి హెలికాప్టర్ అవసరమని కర్రార్ హైద్రీ అన్నారు. అతను ఇంకా 6,000మీటర్ల నుంచి 6,500మీటర్ల వరకు కిందకు దిగవలసి ఉందని హైద్రీ వెల్లడించారు.

    తీవ్రంగా మంచు కారణంగా నంగా పర్బత్‌పై చిక్కుకుపోయిన ఆసిఫ్ భట్టి కోసం తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం అధికారులను ఆదేశించారు.

    ఆసిఫ్, ప్రఖ్యాత పాకిస్థానీ పర్వతారోహకులు డాక్టర్ జబ్బార్ భట్టి, డాక్టర్ నవీద్, సాద్ ముహమ్మద్, ఫహీమ్ పాషాలతో కలిసి కొన్ని రోజుల క్రితం సాహసయాత్రకు బయలుదేరారు.

    అయితే అతనితో వెళ్లిన ఇతర సభ్యులు ఇంకా పర్వత శిఖరంపైకి యాత్రను ప్రారంభించలేదుని, ఆసిఫ్ మాత్రమే వెళ్లాడని హైద్రీ చెప్పారు. పర్వతారోహకుడు షెహ్రోజ్ కాషిఫ్ ఆసిఫ్ రెస్క్యూ మిషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

    మంచు పర్వతం

    ప్రపంచంలోని ఐదు అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో 'నంగా పర్బత్' ఒకటి

    నంగా పర్బత్ పర్వత్వం ప్రపంచంలోని మొదటి ఐదు అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో ఒకటి.

    ఇప్పటి వరకు 85 మంది పర్వతారోహకులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించి మరణించారు. అందుకే నంగా పర్బత్‌ను "కిల్లర్ మౌంటైన్" గా పిలుస్తారు.

    ప్రపంచంలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న 14 పర్వతాల్లో ఐదు పాకిస్తాన్‌లో ఉన్నాయి. 1953లో మొదటిసారిగా ఈ శిఖరాన్ని ప్రయత్నించి 30 మందికి పైగా మరణించిన తర్వాత దీన్ని నంగా పర్బత్‌‌ను "కిల్లర్ మౌంటైన్" పిలవడం ప్రారంభమైంది.

    గత నెలలో, నార్వే, రష్యా, యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, టర్కీ, మెక్సికో, నేపాల్ మరియు పాకిస్థాన్ నుంచి 23 మంది పర్వతారోహకులు నంగా పర్బత్ శిఖరాన్ని అధిరోహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పాకిస్థాన్

    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  సుప్రీంకోర్టు
    తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ న్యూజిలాండ్
    భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే? టీమిండియా
    చివరి వన్డేలో 47 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి న్యూజిలాండ్

    ప్రధాన మంత్రి

    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా నరేంద్ర మోదీ
    రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి
    తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో నరేంద్ర మోదీ
    ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్ కేంద్రమంత్రి

    తాజా వార్తలు

    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ఈజిప్ట్
    అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ'  అదానీ గ్రూప్
    బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి స్వీడన్
    IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు ఐఎండీ

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  అమెరికా
    కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!  ప్రిన్స్ హ్యారీ
    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025