NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Indonesia: ఇండోనేషియాలో రన్‌వేపై అదుపుతప్పిన విమానం..48 మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Indonesia: ఇండోనేషియాలో రన్‌వేపై అదుపుతప్పిన విమానం..48 మందికి గాయాలు 
    ఇండోనేషియాలో రన్‌వేపై అదుపుతప్పిన విమానం

    Indonesia: ఇండోనేషియాలో రన్‌వేపై అదుపుతప్పిన విమానం..48 మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    03:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలోని యాపిన్ ద్వీపంలో 48 మందితో టేకాఫ్ అవుతున్న ఏటీఆర్-42 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.

    విమానం రన్‌వేపై అదుపు తప్పి సమీపంలోని చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

    త్రిగన ఎయిర్‌కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం జయపురకు బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది.

    విమాన ప్రమాదం సమయంలో విమానంలో ఓ పాపతో సహా 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

    గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించామని, ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి ఆర్ద్యాన్ యూకీ తెలిపారు.

    వివరాలు 

    మరో విమానం కూలిపోవడంతో 54 మంది మరణించారు 

    ఇండోనేసియాకు ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన రికార్డు ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రకృతి విపత్తులతో ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి,అనేక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

    1945 నుండి ఇప్పటి వరకు 100కు పైగా ప్రమాదాలు జరిగినట్లు,1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ డేటా చెబుతోంది.

    ఆసియాలో ఇది అత్యంత ప్రమాదకరమైన విమానయాన రికార్డు.అగ్నిపర్వతాలు బద్దలై బూడిద వ్యాపించడం,ఇతర భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ విమాన ప్రయాణాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

    1990లలో ఇండోనేసియా,కొంతకాలం నియంతృత్వ పరిపాలన తర్వాత,ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచింది.

    ఆ సమయంలో నియమాలు పట్టించుకోకుండా భారీగా పెట్టుబడులు వచ్చాయి.భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయి.2015లో త్రిగన ఎయిర్‌కు చెందిన మరో విమానం కూలిపోవడంతో 54 మంది మరణించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విమాన ప్రమాద దృశ్యాలు 

    Hari ini:
    Trigana Air ATR42-509 PKYSP tergelincir saat lepas landas di Serui menuju Jayapura.

    42 penumpang dengan 6 crew selamat dan info sementara tidak ada yang cedera. pic.twitter.com/pLEUp9YyFu

    — Gerry Soejatman (@GerryS) September 9, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండోనేషియా
    విమానం

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    ఇండోనేషియా

    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు అంతర్జాతీయం
    కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి తమిళనాడు

    విమానం

    విమానంలో గాల్లో ఉండగానే బెంబెలెత్తిన ప్రయాణికులు..వేగంగా 28 వేల అడుగులకు దూసుకొచ్చిన ఫ్లైట్ ఇటలీ
    ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం  ఇండిగో
    ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ  ఆకాశ ఎయిర్
    విమానాలను తాకిన కర్ణాటక బంద్ సెగ.. 44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025