NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా
    తదుపరి వార్తా కథనం
    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా
    పుతిన్‌ను ఒప్పించి ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపగలరు: ఆమెరికా

    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా

    వ్రాసిన వారు Stalin
    Feb 11, 2023
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.

    యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌కు ఇంకా సమయం ఉందని జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకోల్పడానికి చేపట్టే ఎలాంటి ప్రయత్నాన్నైనా అమెరికా స్వాగతిస్తుందని చెప్పారు.

    జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మాస్కోలో కలిసిన ఒక రోజు తర్వాత జాన్ కిర్బీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    అమెరికా

    ఉక్రెయిన్ ప్రజల బాధలకు కారణమైన ఏకైక వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్: అమెరికా

    ఉక్రెయిన్ ప్రజలు అనుభవిస్తున్న బాధలకు కారణమైన ఏకైక వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. శక్తివంతమైన బాంబులు, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగిస్తూ ఉక్రెయిన్‌ను సర్వనాశనం నాశనం చేస్తున్నట్లు కిర్బీ చెప్పారు.

    దేశ పరిస్థితి మరింత దిగజారుతున్న నేపథ్యంలో పుతిన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నట్లు కిర్బీ పేర్కొన్నారు. అయితే బలమైన మధ్యవర్తి కోసం జెలెన్‌స్కీ ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

    అలాగే, రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఇప్పటికే ప్రధాని మోదీ పలుమార్లు చర్చలు జరిపారు. ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు.

    ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ యొక్క శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో పీఎం మోదీ చెప్పిన మాటలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్లాదిమిర్ పుతిన్
    ప్రధాన మంత్రి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    వ్లాదిమిర్ పుతిన్

    ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025