English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
    తదుపరి వార్తా కథనం
    G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
    దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

    G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

    యూఏఈ-UNITED ARAB EMIRATES G-20 గ్రూపులో సభ్య దేశ కానప్పటికీ భారత్ ఆహ్వానం మేరకు ఈ కీలక శిఖరాగ్ర సమావేశానికి ఆ దేశం హాజరుకానుంది.

    ఈ నేపథ్యంలోనే భారత్-యూఏఈ దేశాల మధ్య ఆహార భద్రత, రక్షణ, వాణ్యిజ్య రంగంలో మరోసారి కీలక చర్చలు జరపనున్నారు. భారత్, యూఏఈ మధ్య గత కొన్నాళ్లుగా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది.

    బిన్, భారత పర్యటనతో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది.విద్య,ఆరోగ్య రంగంపైనా ఇరు దేశాలు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నాయి.

    DETAILS

    20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ కు మోదీ

    మరోవైపు గతేడాది బిన్ యూఏఈ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా భారత్ రానున్నారు. గత జులై 15న ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నా ప్రధాని మోదీ, అటు నుంచే సరాసరిగా యూఏఈ పర్యటనకు వెళ్లారు.

    అక్కడ ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు సాగించారు. చంద్రయాన్-3 విజయవంతాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 24న ప్రధాని మోదికి బిన్ ఫోన్ చేసి అభినందించారు.

    అంతేకాకుండా ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశంలో యూఏఈ సభ్యత్వానికి భారత్ మద్దతు పలికినందుకు మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.

    సెప్టెంబర్ 7న ఇండోనేషియాలో మోదీ పర్యటించనున్నారు. జకార్తాలో జరగనున్న 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    DETAILS

    గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో చేరనున్న యూఏఈ

    ఈ మేరకు రెండు శిఖరాగ్ర సమావేశాలను జకార్తాలో జరగనున్నాయి. ఈ మేరకు ఆసియాన్ సమ్మిట్ హోస్ట్ దేశంగా ఇండోనేషియా వ్యవహరిస్తోంది.

    ఇప్పటికే సెప్టెంబర్ 4న G-20 చీఫ్ కోఆర్డినేటర్ హర్ష్ ష్రింగ్లా, హోంకార్యదర్శి అజయ్ భల్లా, సెక్రటరీ అపూర్వచంద్ర శిఖరాగ్ర సమావేశాల భద్రత, పూర్తి ఏర్పాట్లపై 2 గంటలపాటు మోదీకి ప్రజెంటేషన్ ఇచ్చారు.

    మరోవైపు జీ-20కి సంబంధించిన వివిధ అంశాలపై ఇవాళ ఉదయం కేంద్ర మంత్రిమండలికీ వివరించనున్నారు.

    బిన్, భారత పర్యటనలో ప్రధాని మోదీ ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో యూఏఈ చేరనుంది. యూఏఈ భారతదేశానికి సన్నిహిత దేశంగా గుర్తింపు పొందింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దుబాయ్
    భారతదేశం
    నరేంద్ర మోదీ

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    దుబాయ్

    ఒక రాత్రికి రూ.1కోటి; ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రిసార్ట్ విశేషాలను తెలుసుకుందామా అంతర్జాతీయం
    కంటి వ్యాధులను గుర్తించడానికి AI యాప్‌ను అభివృద్ధి చేసిన 11 ఏళ్ల కేరళ బాలిక టెక్నాలజీ
    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ
    అబుదాబీలో ప్రాణాంతక మెర్స్‌ వైరస్‌ కేసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ ప్రపంచ ఆరోగ్య సంస్థ

    భారతదేశం

    CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి  కర్ణాటక
    చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల ఫోకస్.. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా చంద్రయాన్-3
    Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం చంద్రయాన్-3
    అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు చంద్రయాన్-3

    నరేంద్ర మోదీ

    మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు అస్సాం రైఫిల్స్
    పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు పశ్చిమ బెంగాల్
    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు స్వాతంత్య్ర దినోత్సవం
    మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా..శివసేన సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు ప్రియాంక గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025