NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం
    తదుపరి వార్తా కథనం
    Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం
    ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం

    Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు.. ఉగ్రదాడి అనుమానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    08:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్‌లోని బాట్‌యామ్‌ సిటీలో భయానక ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి మూడు బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి.

    అధికారులు అందించిన వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం బాట్‌యామ్‌ లోని వివిధ ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి.

    సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిర్వీర్య విభాగం అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

    అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్థానిక అధికారులు ధృవీకరించారు. పోలీసులు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

    ఇదే సందర్భంలో, పాలస్తీనా ఉగ్రవాద సంస్థలు ఈ పేలుళ్లకు బాధ్యత వహించి ఉండవచ్చని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి కాట్జ్ అభిప్రాయపడ్డారు.

    వెస్ట్‌బ్యాంక్‌లో పరికరాల పరిశీలనలో తాజా పేలుడు పదార్థాలు కనుగొనడం,ఈ పేలుళ్లకు సంబంధం ఉందని టెల్‌అవీవ్‌ పోలీసు అధికారి తెలిపారు.

    వివరాలు 

    హమాస్ అప్పగించిన మృతదేహం వివాదం 

    దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

    ఈ ఘటనపై అత్యవసర భద్రతా సమీక్షా సమావేశాన్ని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

    ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, హమాస్ వారి చెరలో మరణించిన నలుగురు ఇజ్రాయెలీ మృతదేహాలను టెల్‌అవీవ్‌కు అప్పగించింది.

    అయితే, అందులో ఒక మృతదేహం ఇజ్రాయెల్‌కు చెందిన మహిళది కాదని ఇజ్రాయెల్‌ అధికారికంగా వెల్లడించింది.

    హమాస్ ఈ విధంగా ఓప్పందాన్ని ఉల్లంఘించిందని టెల్‌అవీవ్ ఆరోపించింది.

    వివరాలు 

    మృతదేహాల ప్రదర్శన.. తీవ్ర విమర్శలు 

    ఖాన్‌యుస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, రెడ్‌క్రాస్ షిర్‌ బిబాస్‌, ఆమె కుమారులు ఎరియల్‌, కఫీర్‌లతో పాటు మరొక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.

    అయితే, హమాస్ ఈ మృతదేహాలను ప్రదర్శనకు పెట్టడం తీవ్ర విమర్శలకు గురైంది.

    2023 అక్టోబర్ 7న, ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్‌ నీరోజ్‌ ప్రాంతం నుండి హమాస్ వీరిని అపహరించింది.

    తర్వాతి కాలంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో వీరు మరణించారని మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ఇజ్రాయెల్

    Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. లెబనాన్‌ సరిహద్దుల్లో సైరన్లతో ఉద్రిక్త వాతావరణం ఇరాన్
    Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 45 మంది పౌరుల మృతి హమాస్
    Iran: విషమంగా సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగం.. ఇరాన్ వారసత్వంపై ఆసక్తిరమైన చర్చ ఇరాన్
    Iran Supreme Leader: ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ.. రెండు రోజుల్లోనే 'ఎక్స్‌' ఖాతా సస్పెన్షన్‌! ఇరాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025