Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు
కెనడాలో ఖలీస్థానీలకు మద్ధతుగా పోస్టులు పెట్టి వివాదానికి తెరలేపిన పంజాబీ యువ గాయకుడు శుభ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం కూడా తన దేశమేనని, తాను ఇక్కడే పుట్టానని, దేశ స్వాతంత్రం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం తన పూర్వీకులు ఎంతో త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, పంజాబ్ ను తన ఆత్మగా పేర్కొన్నారు. పంజాబ్ తన రక్తంలో ఉందన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం, తాను పంజాబీ కావడం వల్లేనన్నారు. అయితే పంజాబీలు తమ దేశభక్తికి రుజువు ఇవ్వాల్సిన అవసరం లేదని, చరిత్రలో పంజాబీలు స్వాతంత్రం కోసం జీవితాలనే త్యాగం చేశారని శుభ్ గుర్తు చేశారు. పంజాబీని దేశ వ్యతిరేకిగా పేర్కొనడం మానుకోవాలని కోరారు.