Bangladeshi diplomats: భారత్లోని ఇద్దరు బంగ్లాదేశ్ దౌత్యవేత్తలపై సస్పెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్లో జరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, భారత్లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
న్యూదిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్లో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్న షబాన్ మహమ్మద్, కోల్కతాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్లో పనిచేస్తున్న రంజన్ సేన్పై ఈ సస్పెన్షన్ను విధించారు.
షబాన్ను తన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. తర్వాత రంజన్ను విధుల నుంచి తొలగించారు.
Details
అన్ని దేశాలతో స్నేహసంబంధాలను కొనసాగిస్తాం: యూనస్
ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో జరిగిన రిజర్వేషన్లకు వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో తీసుకున్నారు.
ఈ ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘర్షణల కారణంగా ప్రధాని షేక్ హసీనా ఆమె పదవి నుండి దిగిపోయి దేశాన్ని వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఉన్నారు.
ఆమె ప్రభుత్వం రద్దయింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
యూనస్ తన ప్రభుత్వం అన్ని దేశాలతో స్నేహసంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు.
Details
50మందికి పైగా గాయాలు
ఆదివారం రాత్రి ఢాకా నగరంలో విద్యార్థులు, పారామిలిటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘటనలో కనీసం 50 మందికి పైగా గాయాలయ్యాయి.
తాత్కాలిక ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉన్న విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లామ్ సహా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ పరిణామాలు కొత్తగా విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టడానికి దారితీసాయి.
ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి ఘర్షణలకు దారితీశాయి.