NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం
    తదుపరి వార్తా కథనం
    Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం
    కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం

    Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 07, 2024
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు చైనా పౌరులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు.

    ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను జిన్నా ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ ఈ పేలుడుకు బాధ్యత వహించినట్లు ప్రకటించింది.

    పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనను ధృవీకరించింది. ఈ దాడి ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో జరిగింది.

    పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు.

    Details

    ఖండించిన చైనా

    పేలుడు సంభవించిన తర్వాత, మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీంతో అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనను ఖండిస్తూ, చైనా ఎంబసీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

    గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని పాకిస్తాన్‌ను కోరింది. చైనా రాయబార కార్యాలయం, పాకిస్తాన్‌లోని చైనా పౌరులు, సంస్థల భద్రతకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

    పాకిస్తాన్‌లోని చైనా సంస్థలు భద్రతపై శ్రద్ధ వహించాలని, స్థానిక పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించింది

    Details

    ఘటనపై ధ్రువీకరించిన పాకిస్థాన్

    అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా ధ్రువీకరించలేదు. విమానయాన శాఖలో పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి ఎయిర్ పోర్ట్ భవనాలను కంపించే స్థాయిలో జరిగింది.

    ఉత్తర నజీమాబాద్, కరీమాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానిక అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.

    ప్రాథమికంగా ఈ దాడి చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగింది, ఎందుకంటే ఆ ప్రాంతంలో వేలాది చైనా కార్మికులు పనిచేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    చైనా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    పాకిస్థాన్

    Gujarat: భారీగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు  గుజరాత్
    CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి  దిల్లీ
    Pakistan: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులకుకు భారీ ఊరట... అవినీతి కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు అంతర్జాతీయం
    Pakistan: పాకిస్థాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు భూకంపం

    చైనా

    China: చైనా 996 వర్క్ కల్చర్ ఏమిటి? అబ్బాయిలు,అమ్మాయిలు ఎందుకు పక్షుల్లా ప్రవర్తిస్తున్నారు? అంతర్జాతీయం
    China: చంద్రుని నమూనాలతో విజయవంతంగా భూమిపైకి చేరిన చైనా చాంగ్‌-6  టెక్నాలజీ
    Graphene : జిలిన్ యూనివర్సిటీ పరిశోధనలు..మూల సిద్ధాంతానికి సవాలు నాసా
    Carbon Fibre Passenger: కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన తొలి ప్యాసింజర్ రైలు పట్టాలపై పరుగులు తీయడానికి సిద్ధమైంది, ప్రత్యేకత ఏంటంటే? అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025