
Khamenei: 'యుద్ధం మొదలైంది'.. ట్రంప్ హెచ్చరికపై ఖమేనీ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రగులుతోంది.
ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా నేరుగా యుద్ధరంగంలోకి దిగబోతోందన్న వార్తలు పరిస్థితిని మరింత ఉద్రిక్తతల దిశగా తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ట్రంప్ వ్యాఖ్యలకు స్పందనగా ఖమేనీ చేసిన పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. "యుద్ధం ప్రారంభమైంది" అనే శీర్షికతో ఆయన చేసిన పోస్ట్ తీవ్ర అనుమానాలను కలిగిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖమేనీ చేసిన ట్వీట్
We must give a strong response to the terrorist Zionist regime.
— Khamenei.ir (@khamenei_ir) June 17, 2025
We will show the Zionists no mercy.
వివరాలు
ట్రంప్ హెచ్చరికకు ఖమేనీ ఘాటైన ప్రతిస్పందన
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలపై ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.
ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు ఖచ్చితంగా తెలుసన్నారు. అయితే,ప్రస్తుతం ఆయన్ని హతమార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
కానీ ఖమేనీ తక్షణమే లొంగిపోవాలని,లేనిపక్షంలో పరిణామాలు ఘోరంగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల కొద్దిసేపటికే ఖమేనీ తన 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
అందులో "నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో ఖైబర్కు వచ్చారు" అని రాశారు.
ఈ సందేశానికి తోడు ఖడ్గాన్ని పట్టుుకున్న ఓ వ్యక్తి కోట గేటు వద్ద ఉన్న దృశ్యాన్ని చూపించే చిత్రాన్ని కూడా జత చేశారు.
వివరాలు
ఖైబర్ యుద్ధాన్ని ప్రస్తావించిన ఖమేనీ
ఆ ఫోటోలో కోటపై మంటలు రగిలిపోతుండడం స్పష్టంగా కనిపించింది. ఈ పోస్ట్ చూసినవారు ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇస్లామిక్ చరిత్రలో 7వ శతాబ్దంలో షియా మతాన్ని మద్దతిచ్చే మొదటి ఇమామ్ ఖైబర్ అనే యూదుల పట్టణంపై యుద్ధం చేసి విజయాన్ని సాధించారు.
ఖమేనీ చేసిన తాజా పోస్ట్ ఆ చారిత్రక సంఘటనను ప్రస్తావించేలా ఉన్నదని ప్రముఖ పత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పేర్కొంది.
ఇదే సమయంలో ఖమేనీ మరోసారి స్పందించారు. "మేము శక్తివంతంగా ప్రతిస్పందిస్తాం. మా ప్రత్యర్థులపై ఎలాంటి కనికరమూ ఉండదు" అంటూ ఆయన మరో సందేశాన్ని విడుదల చేశారు.
వివరాలు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న క్షిపణుల దాడులు..
ఇరాన్, ఇజ్రాయెల్ మద్య పరస్పర క్షిపణుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు మోగిపోతున్నాయి.
బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్లో పలు చోట్ల బలమైన పేలుడు ధ్వనులు వినిపించాయి.
అప్రమత్తతలో భాగంగా సైరన్లు మోగాయి. ఇదే సమయంలో టెల్ అవీవ్ నగరంలో కూడా తీవ్రంగా పేలుళ్లు సంభవించాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య జెరూసలెంలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని శుక్రవారం వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు సంబంధిత అధికారులు ప్రకటించారు.