NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన
    తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన

    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 16, 2025
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశంపై నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి.

    తుర్కియేకి చెందిన వస్తువులు, సేవలను నిషేధించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి.

    ఈ పరిణామాల మధ్య, భారతీయ విమానాశ్రయాల్లో సేవలందిస్తున్న తుర్కియే కంపెనీ 'సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌'కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది.

    ఈ నేపథ్యంలో సెలెబీ సంస్థ స్పందిస్తూ, తమది అసలు తుర్కియే కంపెనీ కాదని స్పష్టంచేసింది.

    తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సమయ్యి తమ బాస్ అన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది.

    Details

    ఎవరికి సంస్థలో వాటాలు లేవు

    సమయ్యి పేరుతో తమ మాతృ సంస్థలో ఎవరికీ వాటాలు లేవని, సంస్థ యాజమాన్యం పూర్తిగా సెలెబియోగ్లు కుటుంబానికి చెందిందని స్పష్టం చేసింది.

    వారు రాజకీయంగా ఏ సంబంధాలు లేకుండా పారదర్శకంగా ఏవియేషన్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది.

    తమ మాతృ సంస్థలో ఉన్న 65 శాతం వాటాలు కెనడా, అమెరికా, యూకే, సింగపూర్, యూఏఈ, పశ్చిమ ఐరోపా దేశాలకు చెందిన సంస్థాగత మదుపరులవేనని సెలెబీ స్పష్టం చేసింది.

    భారత్‌లో తమ సేవలు పౌరవిమానయాన భద్రతా మండలి (BCAS), సీఐఎస్‌ఎఫ్‌, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరంతరం ఆడిట్‌కు లోనవుతాయని పేర్కొంది.

    Details

    సెలెబీ సంస్థకు అనుమతులు రద్దు

    భారత భద్రతా, పన్ను, వైమానిక నిబంధనల్ని తాము కచ్చితంగా పాటిస్తున్నామని తెలిపింది. అయితే భద్రతాపరమైన కారణాలతో సెలెబీ సంస్థకు భారతదేశంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు 'బీసీఏఎస్'గురువారం ప్రకటించింది.

    హైదరాబాద్‌, చెన్నై సహా తొమ్మిది విమానాశ్రయాల్లో సెలెబీ సేవలందిస్తోంది.

    ఒప్పందాల రద్దు నేపథ్యంలో, సంబంధిత విమానాశ్రయాల్లో సరకు రవాణా, ప్రయాణికుల కదలికలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యాయని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    భారతదేశం

    తాజా

    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా
    Robinhood: థియేట‌ర్‌లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్ నితిన్

    పాకిస్థాన్

    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  భారతదేశం
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  అంతర్జాతీయం
    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం అంతర్జాతీయం
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ

    భారతదేశం

    Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన!  భారతదేశం
    Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !! పాకిస్థాన్
    Indian Airspace: భారత  గగనతలంపై పాక్ విమానాల రాకపోకలపై నిషేధం   భారతదేశం
    #NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా? పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025