Hezbollah-Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా నేత నస్రల్లా కుమార్తె మరణం?
హెజ్బొల్లా సంస్థపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం లెబనాన్లో భారీ స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరుట్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, ఈ దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె మృతిపై ఇప్పటివరకు హెజ్బొల్లా గానీ, లెబనాన్ ప్రభుత్వం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.