
Trump: అక్రమ వలసదారులను ఉపేక్షించం.. భారతీయుడి హత్యపై స్పందించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు డాలస్లో భారతీయ పౌరుడు చంద్ర నాగమల్లయ్య హత్యపై తీవ్రంగా స్పందించారు.ఈ కేసులో నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అధికారిక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికాను మళ్లీ సురక్షిత దేశంగా తీర్చిదిద్దడమే వారి ప్రధాన లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు. చంద్ర నాగమల్లయ్య హత్య ఘటనలో సంచలనమైన విషయాలు తమ దృష్టికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. మల్లయ్య డాలస్లో మంచి పేరు సంపాదించారు.అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య,కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. ఇందులో ప్రధానంగా క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు ట్రంప్'ట్రూత్ సోషల్'వేదికలో పోస్ట్ చేశారు.
వివరాలు
క్యూబా ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను తమ దేశంలోనే ఉంచుకోవాలనుకోలేదు
ట్రంప్ బైడెన్ ప్రభుత్వ విధానాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. నిందితుడు మార్టినెజ్ అమెరికాలో ఉన్న కారణం గత ప్రభుత్వం అనుసరించిన సున్నితమైన వలస విధానమేనని ఆయన ధ్వజమెత్తారు. అతడికి నేరచరిత్ర ఉన్నా.. నివాసానికి అనుమతించారని ధ్వజమెత్తారు. ట్రంప్ ప్రకారం, మార్టినెజ్ గతంలో చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనం వంటి నేరాలకు పాల్పడి అరెస్టు అయ్యాడు. అలాంటి వ్యక్తిని బైడెన్ మా గడ్డ మీదకు తీసుకొచ్చారు ముఖ్యంగా క్యూబా ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను తమ దేశంలోనే ఉంచుకోవాలనుకోలేదు. ట్రంప్ హామీ ఇచ్చిన విధంగా, ఇకపై అక్రమ వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.
వివరాలు
నాగమల్లయ్య తల నరికి మరీ..
సెప్టెంబర్ 10న జరిగిన ఈ ఘటనలో, నాగమల్లయ్య హత్య జరిగిన మోటెల్లో యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. నాగమల్లయ్య తల నరికి మరీ దానినిచెత్తబుట్టలో వేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది.