Turkish Airlines: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. అత్యవసరంగా ల్యాండింగ్.
సీటెల్ నుండి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, కారణం పైలట్ చనిపోవడమే. ఈ విషయాన్ని టర్కీ ఎయిర్లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అధికారిక ప్రకటనలో వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫ్లైట్ నంబర్ 204 లోని 59 ఏళ్ల పైలట్ ఇల్చిన్ పెహ్లివాన్, మంగళవారం రాత్రి 7:02 గంటలకు సీటెల్ నుండి టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యంలో అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే ఆయనకు వైద్య సహాయం అందించారు. అయితే, వైద్య బృందం అతన్ని రక్షించలేకపోయింది.