Turkish Airlines: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. అత్యవసరంగా ల్యాండింగ్.
ఈ వార్తాకథనం ఏంటి
సీటెల్ నుండి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, కారణం పైలట్ చనిపోవడమే.
ఈ విషయాన్ని టర్కీ ఎయిర్లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
అధికారిక ప్రకటనలో వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫ్లైట్ నంబర్ 204 లోని 59 ఏళ్ల పైలట్ ఇల్చిన్ పెహ్లివాన్, మంగళవారం రాత్రి 7:02 గంటలకు సీటెల్ నుండి టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యంలో అపస్మారక స్థితిలో పడిపోయారు.
వెంటనే ఆయనకు వైద్య సహాయం అందించారు. అయితే, వైద్య బృందం అతన్ని రక్షించలేకపోయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విమానం నడుపుతూ టర్కిష్ ఎయిర్లైన్స్ పైలట్ మృతి..
Turkish Airlines flight makes an emergency landing at New York’s JFK after the captain dies onboard, airline officials have said.
— Breaking Aviation News & Videos (@aviationbrk) October 9, 2024
The 59-year-old pilot was identified as Ilcehin Pehlivan.
The Airbus A350-900 was heading from Seattle to Istanbul when it made the diversion.… pic.twitter.com/2TNsgm30Wo