NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India-Pak Tensions: ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక చర్చలు 
    తదుపరి వార్తా కథనం
    India-Pak Tensions: ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక చర్చలు 
    ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక చర్చలు

    India-Pak Tensions: ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక చర్చలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    08:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

    భద్రతా మండలి (UNSC)లో భారత్,పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రధాన అంశంగా చర్చకు రానున్నాయి.

    ఈ సందర్భంగా రెండు దేశాలకు తమ అభిప్రాయాలు అంతర్జాతీయ వేదికపై వినిపించుకునే అవకాశం లభించనుంది.

    గత ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం పట్టణానికి సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

    భారత్ ఈ దాడికి పాకిస్తానే బాధ్యత వహించిందని నిశ్చయించి,ఆ దేశంపై వివిధరకాల ఆంక్షలు విధిస్తూ తీవ్రంగా స్పందిస్తోంది.

    ఇది పాకిస్తాన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేయగా,అది ప్రతిస్పందనగా కౌంటర్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

    వివరాలు 

    సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. అక్రమంగా వ్యవహరిస్తున్న  భారత్ 

    ముఖ్యంగా, భారత్‌ సింధు నదీ జలాల సరఫరాను నిలిపివేయడాన్ని పాకిస్తాన్ నేరుగా "యుద్ధ చర్య"గా అభివర్ణిస్తోంది.

    ఈ నేపథ్యంలో,ఆదివారం పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ,భారత్ తమపై దాడి యత్నాలతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు.

    సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా భారత్ వ్యవహరిస్తోందని,ఈ విషయాలన్నింటినీ భద్రతా మండలిలో తమ దేశం బలంగా ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.

    ఇంకొకవైపు,భద్రతా మండలి ఇప్పటికే పహల్గాం ఘటనను ఖండించిన సంగతి తెలిసిందే.

    సోమవారం జరగనున్న సమావేశానికి ముందు మండలిలోని పలువురు ప్రతినిధులు ఇరు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలపై స్పందించారు.

    ఉగ్రవాదానికి ఏ రూపంలోనైనా తాము వ్యతిరేకమని, అదే సమయంలో ఆ ప్రాంతంలో నెలకొన్న పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆందోళనకు గురిచేస్తున్నాయని మండలి అభిప్రాయపడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ఐక్యరాజ్య సమితి

    Palestine : ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారన్న పాలస్తీనా.. గాజాలో సేఫ్టీ లేదన్న యూఎన్ ఇజ్రాయెల్
    గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్  ఇజ్రాయెల్
    ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..  తాజా వార్తలు
    Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025