NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / US military: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి.. 37 మంది ఉగ్రవాదుల మృతి 
    తదుపరి వార్తా కథనం
    US military: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి.. 37 మంది ఉగ్రవాదుల మృతి 
    సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి.. 37 మంది ఉగ్రవాదుల మృతి

    US military: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి.. 37 మంది ఉగ్రవాదుల మృతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 29, 2024
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ వరుస దాడులు చేస్తోంది.

    ఇక సిరియాలో అమెరికా బలగాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. ఈ వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

    వీరంతా ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్), అల్-ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారని, మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.

    Details

    900 మంది భద్రతా సిబ్బందిని మోహరించిన అమెరికా

    అల్-ఖైదా అనుబంధ 'హుర్రాస్ అల్-దీన్ గ్రూప్'కు చెందిన సీనియర్ ఉగ్రవాది వాయువ్య సిరియాలోని దాడుల్లో హతమయ్యాడు.

    అతని సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

    సిరియాలోని ఐసిస్ శిక్షణ స్థావరంపై భారీ వైమానిక దాడి చేసి, 28 మంది ఉగ్రవాదులను అంతమొందించినట్లు వెల్లడించింది.

    తాజా దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నాయని, తమకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలని సహించమని అమెరికా స్పష్టం చేసింది.

    సిరియాలో ఐసిస్ పునరుద్ధరణను అడ్డుకోవడం కోసం సుమారు 900 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిరియా
    అమెరికా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సిరియా

    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం టర్కీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు టర్కీ
    భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు టర్కీ

    అమెరికా

    Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు భూకంపం
    Indian Air Force : 'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు భారతదేశం
    Green Card: గ్రీన్ కార్డ్ పొందడానికి 100 సంవత్సరాలు పడుతుందా? విద్యార్థులు, ఉద్యోగార్ధులను'అమెరికాకు రావద్దని' హెచ్చరించిన భారతీయ ఇంజనీర్  అంతర్జాతీయం
    Traumagel: ప్రమాదాల సమయంలో క్షణాల్లో రక్తస్రావం ఆపగల జెల్ ను ఆమోదించిన FDA ఆమోదం  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025