NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India: భారత నిఘా సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిటీ సిఫార్సు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India: భారత నిఘా సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిటీ సిఫార్సు

    India: భారత నిఘా సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిటీ సిఫార్సు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    02:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశానికి (India) చెందిన నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) పై అమెరికా (USA) ఆంక్షల కత్తి వేలాడుతోంది

    ఇటీవల 'యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలిజియస్‌ ఫ్రీడమ్‌' సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

    సిక్కు వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణమని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది.

    ఈ కమిషన్‌ మంగళవారం తమ వార్షిక నివేదికను విడుదల చేసింది.

    ఇందులో భారత్‌పై మరిన్ని ఆరోపణలు చేసింది. మైనార్టీలు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

    మత స్వేచ్ఛ పరంగా భారత్‌ను ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది. 2024లో కూడా మతపరమైన మైనార్టీలపై వేధింపులు, దాడులు పెరిగాయని అభిప్రాయపడింది.

    వివరాలు 

     'రా'పై ఎలాంటి చర్యలు తీసుకోదని నిపుణులు అంచనా 

    ఈ నివేదికపై భారత్‌ తక్షణ స్పందించలేదు. అయితే, ఈ సంస్థ ఇచ్చిన నివేదికను ట్రంప్‌ ప్రభుత్వాన్ని తప్పనిసరి పాటించాల్సిన అవసరం లేదు.

    వియత్నాం కమ్యూనిస్ట్‌ పాలకులపై కూడా ఈ కమిషన్‌ విమర్శలు చేసింది.

    మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోందని పేర్కొంది. అందువల్ల ఆ దేశాన్ని కూడా ఆందోళనకర జాబితాలో చేర్చాలని సూచించింది.

    చైనాను అడ్డుకోవడానికి అమెరికా భారత్‌, వియత్నాం దేశాలతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

    బీజింగ్‌ను నిరోధించేందుకు న్యూదిల్లీ కీలకమైన శక్తిగా ఉందని అమెరికా గత కొన్ని ఏళ్లుగా భావిస్తోంది.

    ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వం భారత నిఘా సంస్థ 'రా'పై ఎలాంటి చర్యలు తీసుకోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    అమెరికా,కెనడాలో సిక్కు వేర్పాటువాదులనే లక్ష్యంగా చేసుకున్న  భారత్‌

    2023లో అమెరికా, కెనడాలో సిక్కు వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత్‌పై ఆరోపణలు వచ్చాయి.

    ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి వికాస్‌ యాదవ్‌పై ఆరోపణలు మోపింది.

    ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్యకు కుట్ర పన్నినట్లు పేర్కొంది.

    మరోవైపు, అమెరికాలో ఉంటూనే పన్నూన్‌ భారత ప్రభుత్వాన్ని బెదిరించే సందేశాలను విడుదల చేస్తూ వస్తున్నాడు.

    సీఆర్పీఎఫ్‌ స్కూళ్లను, ఎయిర్‌ ఇండియా విమానాలను, కుంభమేళాను లక్ష్యంగా చేసుకోవాలని ఖలిస్థానీలకు పిలుపునిచ్చినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    అమెరికా

    US: అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని అదృశ్యం.. పోలీసుల గాలింపు.. కుట్రపై అనుమానాలు అంతర్జాతీయం
    Trump: ట్రంప్ నివాసం వద్ద సెక్యూరిటీ వైఫల్యం.. ఆంక్షల వలయంలోకి దూసుకొచ్చిన ప్రైవేటు విమానం  అంతర్జాతీయం
    US stock market loses: అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం.. 4 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి..  బిజినెస్
    US: బీచ్‌లో అదృశ్యమైన సుదీక్ష.. చివరిసారి చూసిన వ్యక్తిపై అనుమానాలు! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025